India vs Pakistan: భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్
T20 World Cup 2026, India vs Pakistan Match: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడటానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ బోర్డు మ్యాచ్ ఆడటానికి ఒక షరతు పెట్టిందని పాకిస్తాన్ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Pakistan Cricket Team: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులు ముగిసే సూచనలు కనిపించడం లేదు. 2026 టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడటానికి పాకిస్తాన్ మొదట నిరాకరించిన సంతగి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం షరతులు విధించిందని నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ను తిరిగి చేర్చుకుంటేనే పాకిస్తాన్ జట్టు భారత్తో ఆడుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. కానీ పీసీబీ ఆ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది.
ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ..
బంగ్లాదేశ్ జట్టు తన అన్ని మ్యాచ్లను భారతదేశం నుంచి శ్రీలంకకు మార్చాలని అకస్మాత్తుగా డిమాండ్ చేయడంతో ఐసీసీ ఆ జట్టును టీ20 ప్రపంచ కప్ నుంచి మినహాయించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించినందున బీసీబీ ఈ ఆకస్మిక డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ డిమాండ్ను ఐసీసీ అంగీకరించలేదు. ఈ అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు, బీసీబీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ, బీసీబీ తన డిమాండ్పై దృఢంగా ఉండిపోయింది. చివరికి ఐసీసీ దాన్ని మినహాయించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది.
పాకిస్తాన్ రాజకీయాలు..
🚨 BIG ANNOUNCEMENT BY PCB 🚨
Pakistan will only consider calling off the boycott and will only play against India on 15th if the ICC brings Bangladesh back into the World Cup. (Qadir Khawaja) pic.twitter.com/bXjF3ds66Q
— 𝐀. (@was_abdd) February 2, 2026
బంగ్లాదేశ్ జట్టు ఓటమి తర్వాత, పాకిస్తాన్ ఈ అంశాన్ని రాజకీయం చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని పీసీబీ తన ప్రభుత్వంతో చర్చించి, చివరికి పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్లో ఆడాలని, కానీ భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని నిర్ణయించింది. పాకిస్తాన్ చర్య తర్వాత, ఐసీసీ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాకిస్తాన్కు ఈ విషయం తెలుసు. పీసీబీ త్వరలో ఈ అంశంపై యూ-టర్న్ తీసుకోవచ్చని భావిస్తున్నారు.
