AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: గణతంత్రం రోజున కివీస్‌ను గడగడలాడించిన భారత్.. హిట్‌మ్యాన్‌ స్పీడ్‌కు తోడైన ధనాధన్ ధోనీ..!

India vs New Zealand: భారత క్రికెట్ జట్టు 2019లో రిపబ్లిక్ డే రోజున న్యూజిలాండ్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనితోపాటు రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు.

Team India: గణతంత్రం రోజున కివీస్‌ను గడగడలాడించిన భారత్.. హిట్‌మ్యాన్‌ స్పీడ్‌కు తోడైన ధనాధన్ ధోనీ..!
Republic Day 2019 January 26th India Vs New Zealand
Venkata Chari
|

Updated on: Jan 26, 2022 | 9:45 AM

Share

On This Day In Cricket: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు(Team India)  చాలా మ్యాచ్‌లు గెలిచింది. కానీ, వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైన విజయంగా మారింది. ఇది జనవరి 26న జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2019లో విరాట్‌ సారథ్యంలో భారత్‌ 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌(India vs New Zealand)ను ఓడించింది. వన్డే సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్. ఇందులో రోహిత్ శర్మ(Rohit Sharma), శిఖర్ ధావన్ అర్ధ సెంచరీలతో రాణించారు. మరోవైపు చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ధీటుగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అది 2019వ సంవత్సరం. జనవరి 26న ఆడిన మ్యాచులో భారత అభిమానులకు ఎంతో థ్రిల్‌ను అందించింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్, ధావన్‌లు టీమిండియాకు ఓపెనింగ్ చేశారు. రోహిత్ 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ధావన్ 67 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు.

రోహిత్, శిఖర్ ఔటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ, అంబటి రాయుడు మధ్య కొన్ని పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ సమయంలో కోహ్లీ 45 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. మరోవైపు రాయుడు 49 బంతుల్లో 47 పరుగులు పూర్తి చేశాడు. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవన్‌లు చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది. ధోనీ 33 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేశాడు. అలాగే కేదార్ కేవలం 10 బంతుల్లో 22 పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసేందుకు తమవంతు సహాయపడ్డారు.

భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున డగ్ బ్రేక్‌వెల్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున కుల్‌దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ కూడా రెండేసి వికెట్లు తీశారు. ఈ విధంగా జనవరి 26న భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: Team India: అడిలైడ్‌లో అదరగొట్టిన భారత్.. విరాట్ విశ్వరూపం, ధోనీ మార్క్‌ ఫినిషింగ్‌తో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

IND vs WI: టీమిండియా ప్లేయింగ్‌XIలో కీలక మార్పులు.. సౌతాఫ్రికా దెబ్బకు వారంతా విశ్రాంతిలోనే?

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!