AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న లక్ష్యాన్ని చేధించలేక కుప్ప కూలిన జట్టు.. ఇన్నింగ్స్‌లో కేవలం 3 బౌండరీలు.. 20 ఓవర్లు ఆడకుండానే ఓటమి

ఓడిన జట్టులోని ఒక బ్యాట్స్‌మెన్ మాత్రమే డబుల్ ఫిగర్‌లను తాకాడు. కేవలం మూడు ఫోర్లు మాత్రమే జట్టు ఖాతాలో చేరాయి. దీంతో 59 పరుగుల తేడాతో ఓడిపోయారు.

చిన్న లక్ష్యాన్ని చేధించలేక కుప్ప కూలిన జట్టు.. ఇన్నింగ్స్‌లో కేవలం 3 బౌండరీలు.. 20 ఓవర్లు ఆడకుండానే ఓటమి
Cricket
Venkata Chari
|

Updated on: Sep 11, 2021 | 12:16 PM

Share

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీంల మధ్య 434 పరుగుల మ్యాచ్ ప్రతీ ఒక్కరి మనస్సులో నిలిచిపోయింది. కానీ, కొన్నిసార్లు జట్టుకు చిన్న లక్ష్యం కూడా సాధించలేని స్కోర్‌గా ఉండిపోతుంది. ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్రికా ప్రాంతంలోని క్వాలిఫయర్స్‌ మ్యాచులో ఇలాంటిదే జరిగింది. ఇక్కడ నమీబియా వర్సెస్ నైజీరియా మహిళా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒక జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. దీంతో 59 పరుగుల తేడాతో ఓడిపోయారు.

బోట్స్వానా క్రికెట్ అసోసియేషన్ ఓవల్ 2 మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచిన నమీబియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా భారీ స్కోరు చేయలేకపోయింది. జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులోని నలుగురు బ్యాట్స్‌మన్‌లు మాత్రమే రెండంకెల సంఖ్యను తాకారు. ఓపెనర్ అడ్రి వాన్ డెర్ మెర్వే 18 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ యాస్మిన్ ఖాన్ 29 పరుగులు సాధించాడు. కైలీన్ గ్రీన్ అదే సంఖ్యలో పరుగులు చేసింది. జూరియన్ డియర్‌గార్డ్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నైజీరియా జట్టు తరఫున తైవో అబ్దుల్కద్రి రెండు వికెట్లు తీశాడు. జాయ్ ఇఫోసా కూడా రెండు వికెట్లు తీశాడు. రాచెల్ అగాతా, అబులోర్ తలో వికెట్ తీశారు.

పేక ముక్కలా కూలిన నైజీరియా విజయానికి నైజీరియా టీం 126 పరుగులు చేయాల్సి ఉంది. లక్ష్యం సులభమే. కానీ, ఈ బృందానికి ఈ స్కోర్ ఓ పెద్ద పర్వతంలా అనిపించింది. ఐదవ ఓవర్ చివరి బంతికే జట్టుకు మొదటి దెబ్బ తగిలింది. ఇష్టర్ శాండీ తొమ్మిది పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యాడు. తర్వాతి ఓవర్ మొదటి బంతికే జట్టు రెండో ఓపెనర్ కెహిందే అబ్దుల్కద్రి ఏడు పరుగులు చేసిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. ఇక్కడ నుంచి నైజీరియా జట్టు వికెట్లు కోల్పోతూనే ఉంది. జట్టులోని ఒక బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల సంఖ్యను తాకాడు. ఈ బ్యాట్స్‌మన్ పేరు ఓమ్న్య అసికా. అతను 29 బంతుల్లో 14 పరుగులు సాధించాడు. నైజీరియా బ్యాట్స్‌మెన్ మూడు ఫోర్లు మాత్రమే కొట్టాడు. 16 బంతుల్లో ఎనిమిది పరుగులతో నాటౌట్‌గా నిలిచిన లక్కీ పాటీ కూడా ఓ ఫోర్ కొట్టాడు. నైజీరియా జట్టు పూర్తి 20 ఓవర్లు ఆడటంలో విఫలమైంది. ఏడు వికెట్ల నష్టానికి 66 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా తరపున గ్రీన్ అత్యధికంగా రెండు వికెట్లు తీశాడు. హే విట్మన్ ఒక వికెట్ సాధించాడు. విక్టోరియా హమున్యేలా, విల్కా మ్వటిలే తలో వికెట్ తీశారు.

Also Read: US Open: యూఎస్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్.. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్‌ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్..!

IPL 2021: మాంచెస్టర్ నుంచి దుబాయ్ వెళ్లనున్న విరాట్ కోహ్లీ, సిరాజ్.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?

IPL 2021: అద్భుతమైన సిరీస్‌కు దురదృష్టకర ముగింపు.. అభిమానులారా క్షమించండి: భారత నయావాల్ భావోద్వేగ ట్వీట్