Asia Cup 2027: ఆసియా కప్ 2027కి 6 జట్లు ఖరారు.. లక్కీ ఛాన్స్ పట్టేసిన నేపాట్ టీం..!
Asia Cup 2027: వచ్చే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2027 (Asia Cup 2027) టోర్నీకి అర్హత సాధించిన ఆఖరి జట్టుగా నేపాల్ క్రికెట్ జట్టు (Nepal cricket team) నిలిచింది. మలేషియా వేదికగా ముగిసిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2026 (ACC Mens Premier Cup 2026) ఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) జట్టును ఓడించి ఈ ఘనత సాధించింది.

Asia Cup 2027: వన్డే ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్ 2027 (Asia Cup 2027) టోర్నీలో పాల్గొనే మొత్తం 6 జట్ల వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. గతంలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో 8 జట్లు బరిలో దిగగా, ఈసారి మాత్రం 6 జట్లకు మాత్రమే అవకాశం లభించింది. బంగ్లాదేశ్ (Bangladesh) ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత క్రికెట్ జట్టు (Team India) తో పాటు పాకిస్థాన్ (Pakistan), శ్రీలంక (Sri Lanka), అఫ్గానిస్థాన్ (Afghanistan) జట్లకు నేరుగా ప్రవేశం దక్కింది. ఈ జాబితాలో ఆఖరి స్థానం కోసం జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్ (ACC Premier Cup) తుది పోరు అత్యంత ఆసక్తికరంగా సాగింది.
మలేషియా (Malaysia) లోని బాయుమాస్ ఓవల్ (Bayumas Oval) మైదానంలో 10 అసోసియేట్ దేశాల మధ్య ఈ టోర్నీ నిర్వహించారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు సాగిన ఈ సిరీస్లో నేపాల్ జట్టు ఫైనల్ చేరింది. తుది పోరులో యూఏఈ (UAE) జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది.
ఎక్కువమంది చదివినది: ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?
నేపాల్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (Asif Sheikh) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ సందీప్ (Sandeep Lamichhane) సారథ్యంలోని ఈ జట్టు స్థిరమైన ప్రదర్శనతో ఆసియా కప్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
నేపాల్ క్రికెట్ చరిత్రలో ఈ టోర్నీకి అర్హత సాధించడం కేవలం రెండోసారి మాత్రమే కావడం విశేషం. సరిగ్గా 2023వ సంవత్సరంలో తొలిసారిగా ఆసియా కప్లో అడుగుపెట్టిన ఈ జట్టు, అప్పట్లో భారత్ అలాగే పాకిస్థాన్ జట్లతో తలపడింది.
అప్పట్లో ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయినప్పటికీ, గడిచిన మూడేళ్ల కాలంలో ఆటతీరును మెరుగుపరుచుకుంది. ఇప్పుడు మరింత అనుభవంతో బరిలోకి దిగుతున్న నేపాల్ జట్టు, అగ్రశ్రేణి జట్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




