AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు.. కానీ కుటుంబ పోషణ కోసం రోజు రూ.250 కూలీ..

టోక్యో ఒలింపిక్స్‌లో దేశం కోసం పతకాలు సాధించిన ఆటగాళ్లపై ప్రభుత్వాలు, సంస్థలు భారీగా డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడంతోపాటు పెద్ద ఒప్పందాలపై సంతకాలు

ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు.. కానీ కుటుంబ పోషణ కోసం రోజు రూ.250 కూలీ..
Naresh Tumda
uppula Raju
|

Updated on: Aug 09, 2021 | 9:02 AM

Share

టోక్యో ఒలింపిక్స్‌లో దేశం కోసం పతకాలు సాధించిన ఆటగాళ్లపై ప్రభుత్వాలు, సంస్థలు భారీగా డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడంతోపాటు పెద్ద ఒప్పందాలపై సంతకాలు చేసుకుంటున్నాయి. కానీ మిగతా ఆటగాళ్లను మాత్రం విస్మరిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు కానీ నేడు వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. దేశంలో ఎంతోమంది టాలెంట్‌ ఉన్న క్రీడాకారులను మాత్రం ఎవ్వరు గుర్తించడం లేదు.

130 కోట్లు ఉన్న భారత జనాభాలో ఎన్ని ఒలింపిక్‌ పతకాలు వస్తున్నాయనేది అందరు ఆలోచించాల్సిన ప్రశ్న. అందులో ఎన్ని బంగారు పతకాలు ఉంటున్నాయో కూడా అందరికి తెలుసు. సరైన క్రీడాకారులను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సాహం అందిస్తే భారతదేశం కూడా పతకాల పట్టికలో ప్రపంచదేశాలోత పోటీ పడుతుంది. గ్రామీణ భారతంలో ప్రతిభ ఉన్న ఎంతోమంది క్రీడాకారులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారికి కూడా గుర్తింపు లేకుండా పోతుంది. తాజాగా టీమిండియా కోసం ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఓ క్రికెటర్ ఇప్పుడు కూలీ చేసుకోవడం చాలా బాధాకరం.

2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో పాల్గొన్న నరేష్ తుమ్దా అనే వ్యక్తి చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నాడు. గుజరాత్‌లోని నవసారికి చెందిన ఈ అంధ క్రికెటర్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం. 2018 మార్చిలో షార్జా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ 308 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టులో సభ్యుడు.నరేష్ తన కుటుంబాన్ని పోషించడానికి కూలీ పనిచేస్తున్నాడు. నవ్‌సారీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. “నేను రోజుకు రూ.250 సంపాదిస్తాను. ముఖ్యమంత్రిని మూడుసార్లు అభ్యర్థించినా ఎలాంటి సమాధానం రాలేదు. నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను ” అని నరేశ్ వాపోయారు.

PMUY : ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ కింద గ్యాస్‌ కనెక్షన్లు..! 5 కోట్ల మంది BPL మహిళలకు అవకాశం..

Godavari – Krishna: ఇవాళ కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ సమావేశం.. బోర్డు మీటింగ్‌కు తెలంగాణ దూరం..

చౌకైన ఎలక్ట్రిక్‌ సైకిల్‌..! ఒక్కసారి చార్జ్‌ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్లు.. ధర ఎంతంటే..?

Follow Us
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!