AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.! టీ20లకు మెంటర్‌గా కొత్త బాధ్యతలు.?

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ పేరు సుపరిచితమే. భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఈ మిస్టర్ కూల్..

IPL 2023: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.! టీ20లకు మెంటర్‌గా కొత్త బాధ్యతలు.?
Ms Dhoni
Ravi Kiran
|

Updated on: Nov 15, 2022 | 3:57 PM

Share

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ పేరు సుపరిచితమే. భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఈ మిస్టర్ కూల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇప్పటిదాకా చెన్నై జట్టుకు ఎన్నో అపురూప విజయాలతో 4 టైటిల్స్ అందించిన ధోని మెరుపులు ఇకపై కనిపించవు. ఐపీఎల్ 2023 తర్వాత ధోని.. ఈ లీగ్‌ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2024లో మిస్టర్ కూల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ప్రముఖ సైట్ టెలిగ్రాఫ్ పేర్కొంది.

ధోని అనుభవాన్ని టీమిండియా కోసం ఉపయోగించుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధోని మెంటార్ లేదా కోచింగ్‌లో బలమైన టీ20 జట్టును తయారు చేయాలని చూస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో ప్లేయర్స్ భయం లేని క్రికెట్ ఆడేందుకు ధోని సేవలు వినియోగించుకోనుందట. అలాగే మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్‌లను ఎంపిక చేయాలని ఆలోచనలో బీసీసీఐ ఉందని టాక్. ఇక ధోని కూడా బీసీసీఐ ఆఫర్‌ను కన్సిడర్ చేయాలని ఆలోచిస్తున్నాడని సన్నిహితుల టాక్.