AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BGT 2023: తొలి టెస్ట్ ఓటమితో.. మైండ్‌గేమ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. ఢిల్లీలో మా ‘స్పీడ్‌ స్టర్’ రీఎంట్రీ అంటూ ప్రకటన

India vs Australia: నాగ్‌పూర్‌ వేదికగా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

BGT 2023: తొలి టెస్ట్ ఓటమితో.. మైండ్‌గేమ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. ఢిల్లీలో మా 'స్పీడ్‌ స్టర్' రీఎంట్రీ అంటూ ప్రకటన
4 టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలనే ఉద్దేశ్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. అదే సమయంలో ఢిల్లీ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. అయితే ఢిల్లీ టెస్టులో ఈ 5గురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లతో భారత జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే. వీరికి మ్యాచ్ గమనాన్ని మార్చే సామర్థ్యం ఉంది. సో రోహిత్ సేన వీరిపై ఓ కన్నేయాల్సి ఉంటుంది. వారెవరో చూద్దాం..
Venkata Chari
|

Updated on: Feb 11, 2023 | 9:24 PM

Share

India vs Australia: నాగ్‌పూర్‌ వేదికగా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెస్ట్ మొదలైన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియా ఖేల్ ఖతం చేసిన టీమిండియా.. 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసిని ఆసీస్ జట్టు.. రెండు సార్లు ఆలౌట్ అయ్యారు. ఇక ఇరుజట్లు రెండో టెస్ట్ కోసం ఢిల్లీకి బయలుదేరనున్నాయి. ఈ క్రమంలో తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా భారీ స్కెచ్ సిద్ధం చేస్తోంది. రెండో టెస్ట్‌లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైందని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడయాలో ప్రకటించింది.

తొలి ఓటమి ఎదురైన కొద్ది గంటల్లోనే ఆసీస్ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఢిల్లీ టెస్ట్‌కు సిద్ధమంటూ ప్రకటించింది. వేలి గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన ఈ స్పీడ్ స్టర్.. కోలుకున్నాడని, రెండో టెస్ట్ ఆడేందుకు రెడీ అయ్యాడంటూ ప్రకటించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీసేందుకే ఇలాంటి ప్లాన్ చేసిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మిచెల్ ఇంకా కోలుకోలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..