AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేదార్‌ జాదవ్‌పై వేటు పడనుందా?

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో భాగంగా టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌ ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో జరిగే తమ ఎనిమిదో మ్యాచ్‌లో టీమిండియా తుదిజట్టులో పలు మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా కేదార్‌ జాదవ్‌ను తప్పించే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్‌ జాధవ్‌ చెత్త బ్యాటింగ్‌తో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. గెలుపు కోసం 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇటు కేదార్‌ జాదవ్‌ కానీ, అటు మహేంద్రసింగ్‌ […]

కేదార్‌ జాదవ్‌పై వేటు పడనుందా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 6:21 PM

Share

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో భాగంగా టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌ ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో జరిగే తమ ఎనిమిదో మ్యాచ్‌లో టీమిండియా తుదిజట్టులో పలు మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా కేదార్‌ జాదవ్‌ను తప్పించే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్‌ జాధవ్‌ చెత్త బ్యాటింగ్‌తో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. గెలుపు కోసం 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇటు కేదార్‌ జాదవ్‌ కానీ, అటు మహేంద్రసింగ్‌ ధోనీ కానీ.. ఆ కసిని, తపనను చూపించలేదు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలన్న ధోరణి వారి ఆటతీరులో ఏ కోశానా కనిపించలేదు. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా… ఈ జోడీ తమకు ఉన్న 31 బంతుల్లో 20 సింగిళ్లు తీసింది. ఏడు డాట్‌ బాల్స్‌ ఆడింది. చివరి ఓవర్‌లో ధోనీ ఒక సిక్స్‌ కొట్టాడు. అప్పటికే మ్యాచ్‌ ఫలితం తేలిపోయింది. ఈ నేపథ్యంలో కేదార్‌ జాదవ్‌పై వేటు పడటం ఖాయమేనని వినిపిస్తోంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించి.. ఆ స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకునే అవకాశముంది.