AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీసీసీఐ మహిళల వన్డే ట్రోఫీ.. జాక్ పాట్ కొట్టిన కరీంనగర్‌ అమ్మాయి

బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం తలపడనున్న హైదరాబాద్ తుది జట్టులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన కట్ట శ్రీవల్లి స్థానం సాధించింది. . జాతీయ స్థాయి సీనియర్ మహిళల విభాగంలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి హైదరాబాద్ జుట్టుకు ఎంపికైన మొదటి మహిళా క్రికెటర్‌గా కట్ట శ్రీవల్లి నిలిచింది.

Telangana: బీసీసీఐ మహిళల వన్డే ట్రోఫీ.. జాక్ పాట్ కొట్టిన కరీంనగర్‌ అమ్మాయి
Karimagar Girl Katta Srivalli Reddy Of Was Part Of The Bcci Womens Cricket Team
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 19, 2024 | 9:07 AM

Share

కరీంనగర్‌లోని బొమ్మకల్, శ్రీపురం కాలనీకి చెందిన కట్ట ఉమారాణి – లక్ష్మారెడ్డి దంపతుల చిన్న కూతురు కట్ట శ్రీవల్లి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం తలపడనున్న హైదరాబాద్ తుది జట్టులో స్థానం సాధించింది. జాతీయ స్థాయి సీనియర్ మహిళల విభాగంలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి హైదరాబాద్ జుట్టుకు ఎంపికైన మొదటి మహిళా క్రికెటర్‌గా కట్ట శ్రీవల్లి నిలవనున్నారు.హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం సమావేశమైన బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్ మరియు సభ్యులు పదిహేను మంది క్రీడాకారుణిలతో కూడిన తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టులో కట్ట శ్రీవల్లి ఎంపికవడం క్రికెట్ అభిమానులకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాభిమానులందరికీ గర్వకారణం అని, తద్వారా కరీంనగర్ జిల్లా పేరు మరోసారి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో భారత మహిళల జట్టు స్వదేశంలో జరగనున్న సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. టీమిండియా మహిళలు వచ్చే నెలలో వెస్టిండీస్‌తో తలపడతారు. ఐర్లాండ్ జనవరి 2025లో భారత్‌తో తలపడుతుంది. వచ్చే నెల 15 నుండి వెస్టిండీస్ మహిళలతో నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌తో ఈ పోరు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. గుజరాత్‌లోని బరోడాలో వన్డేలు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరిలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడు వన్డేల సిరీస్ కోసం ఐర్లాండ్ మహిళలతో టీమిండియా తలపడనుంది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో వెస్టిండీస్ మరియు ఐర్లాండ్‌లతో సిరీస్‌లు ఒక భాగం.

మరోవైపు న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌ను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సెంచరీ చేసిన స్మృతి మంధాన మరియు హాఫ్ సెంచరీకి సహకరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ నుండి సిరీస్ డిసైడర్ అద్భుతమైన ప్రదర్శనను చూసింది. భారత్ ఆరు వికెట్ల తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంధాన సెంచరీ మేకింగ్ ఫీట్‌తో మిథాలీ రాజ్‌ను అధిగమించి, మహిళల క్రికెట్‌లో సెంచరీ సాధించిన భారత అగ్రగామిగా నిలిచింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తునికి పండు.. పోషకాలు మెండు.. ఒక్కసారి రుచి చూస్తే వెంటపడాల్సిందే
తునికి పండు.. పోషకాలు మెండు.. ఒక్కసారి రుచి చూస్తే వెంటపడాల్సిందే
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా