AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Scandals: ఐపీఎల్ చరిత్రలో 5 అతిపెద్ద వివాదాలు.. రిచ్ లీగ్‌లో రచ్చలేపిన ఇష్యూలివే?

Top 5 IPL Biggest Scandals: ఐపీఎల్ చరిత్రలో ఐదు అతిపెద్ద వివాదాలు మాయని మచ్చలా మిగిలాయి. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన చెంపదెబ్బ ఘటన నుంచి, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం, రవీంద్ర జడేజాపై నిషేధం, కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, లలిత్ మోడీ బహిష్కరణ వరకు ఎన్నో వివాదాలు ఐపీఎల్‌లోని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి.

IPL Scandals: ఐపీఎల్ చరిత్రలో 5 అతిపెద్ద వివాదాలు.. రిచ్ లీగ్‌లో రచ్చలేపిన ఇష్యూలివే?
Ipl 2025 New Rules
Venkata Chari
|

Updated on: Mar 15, 2025 | 1:53 PM

Share

IPL History Major Controversies: ఐపీఎల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌గా మారింది. అందుకే ప్రతి ఆటగాడు ఐపీఎల్ ఆడాలని కలలు కంటాడు. దీనిలో చాలా మంది తెలియని క్రికెటర్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారి, ఆపై వారికి ప్రత్యేక అభిమానుల ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఇందులో మయాంక్ యాదవ్, రింకు సింగ్, నితీష్ రెడ్డి వంటి చాలా మంది యువ ముఖాలు ఇటీవల తమ జట్టుకు స్టార్లుగా మారారు. కానీ, ఐపీఎల్ సమయంలో మైదానంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు టైటిల్ గెలవాలనే ఒత్తిడిలో ఉంటారు. దీని కారణంగా ఈ లీగ్‌లో అనేక వివాదాలు తలెత్తాయి. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో జరిగిన ఐదు అతిపెద్ద వివాదాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ చెంపదెబ్బ సంఘటన..

ఐపీఎల్ 2013 కూడా చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రారంభమైన 12వ రోజున, మైదానంలో ఒక పెద్ద సంఘటన చోటు చేసుకుంది. నిజానికి ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత, శ్రీశాంత్ హర్భజన్ సింగ్‌ను ‘దురదృష్టవంతుడు’ అంటూ పిలిచాడు. దీంతో భజ్జీ కోపంతో మైదానం మధ్యలో శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించాడు. దీంతో ఇష్యూ తీవ్రమైంది. ఈ చర్య కారణంగా భజ్జీపై సీజన్ మొత్తం నిషేధం విధించారు. అయితే, బీసీసీఐ అతన్ని ఐదు వన్డే మ్యాచ్‌ల నుంచి కూడా మినహాయించింది.

2. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం..

ఐపీఎల్ చరిత్రలో, ఈ లీగ్‌పై 2013 సంవత్సరంలో అతిపెద్ద కళంకం ఏర్పడింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్ళు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా పేర్లు బయటకు వచ్చినప్పుడు, ఆ ఆటగాళ్లపై బీసీసీఐ జీవితాంతం నిషేధం విధించింది. ఇది కాకుండా, బెట్టింగ్ కేసులో, చెన్నై యజమాని ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ యజమాని రాజ్ కుంద్రాను బీసీసీఐ దోషులుగా నిర్ధారించింది. దీని కారణంగా రాజస్థాన్, చెన్నై జట్లపై రెండేళ్లు (2016-2017) నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి

3. రవీంద్ర జడేజాపై ఏడాది నిషేధం..

ఐపీఎల్‌లో, ఫ్రాంచైజీలు తమ జట్టు తరపున ఆడటానికి ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తుంటాయి. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగమైనప్పుడు, ఎవరికీ తెలియజేయకుండా ముంబై ఇండియన్స్‌లో చేరడానికి ఒప్పందంపై సంతకం చేశాడు. దీంతో జడేజా ఒక సంవత్సరం పాటు నిషేధానికి గురయ్యాడు. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళలో చేరిన తర్వాత, అతను మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమయ్యాడు.

4. కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం..

ఐపీఎల్‌లో టీం ఇండియా ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య కూడా గొడవ జరిగింది. ఐపీఎల్‌లో కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో, కోహ్లీ రాంగ్ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. గంభీర్ అతనితో ఏదో అన్నాడు, ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య చాలా వాడీవేడీ మాటల యుద్ధం కనిపించింది. మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్ళు ఇద్దరినీ విడదీసే సమయానికి, విషయాలు చాలా దూరం వెళ్ళాయి.

5. ఐపీఎల్ వ్యవస్థాపకుడిపై బహిష్కరణ..

భారతదేశంలో ఐపీఎల్‌కు జన్మనిచ్చిన లలిత్ మోడీని 3 సీజన్ల తర్వాత లీగ్ నుంచి బయటకు పంపించారు. ఐపీఎల్ ఆర్థిక విషయాల్లో లలిత్ మోడీ చాలా అవకతవకలు చేశాడు. దీని కారణంగా అతనికి లీగ్ నుంచి నిష్క్రమించే మార్గం చూపించారు. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల అనుమానాస్పద వేలం, సోనీతో ప్రసార ఒప్పందంలో అవకతవకలు వంటి 5 ప్రధాన కేసుల్లో లలిత్ మోడీ నిందితుడిగా పరిగణించారు. ఆ తరువాత అతను ఇప్పుడు ఈ లీగ్‌కు దూరంగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..