AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్తాన్ ఆటగాళ్లకు రూ. 33 లక్షల జరిమానా విధించిన పీసీబీ.. కారణం ఏంటో తెలుసా?

Pakistan Cricket Team: ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో అవమానకరమైన ఓటమి తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇప్పుడు వారు గతంలో చేసిన తప్పులకు జరిమానా విధిస్తోంది. దీని ద్వారా పీసీబీ మొత్తం రూ.33 లక్షలు జరిమానా వసూలు చేసింది.

Pakistan: పాకిస్తాన్ ఆటగాళ్లకు రూ. 33 లక్షల జరిమానా విధించిన పీసీబీ.. కారణం ఏంటో తెలుసా?
Pakistan Cricket Team
Venkata Chari
|

Updated on: Mar 15, 2025 | 1:23 PM

Share

Pakistan Cricket Team: ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. మొదటి అడుగుగా, దేశీయ టోర్నమెంట్లలో ఆడే ఆటగాళ్ల జీతాలను తగ్గించింది. ఆ తర్వాత, జాతీయ జట్టు ఆటగాళ్లకు ఇప్పుడు జరిమానా విధించడంతో, పీసీబీ మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది.

రూ. 33 లక్షల జరిమానా..

పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, 2024 అక్టోబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ముల్తాన్ టెస్ట్ నుంచి దక్షిణాఫ్రికా సిరీస్ వరకు, పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు రూ.33 లక్షల జరిమానా విధించింది.

పాకిస్తాన్ జట్టు యువ ఓపెనర్ సైమ్ అయూబ్, వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అబ్దుల్లా షఫీక్ లకు చెరో 5 లక్షల రూపాయల జరిమానా విధించారు. దీనికి ప్రధాన కారణం క్రమశిక్షణ లేని ప్రవర్తన అని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా ఈ ముగ్గురు ఆటగాళ్ళు రాత్రి ఆలస్యంగా హోటల్‌కు చేరుకున్నారు. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు జరిమానా విధించారు.

అదేవిధంగా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ సమయంలో, కొంతమంది ఆటగాళ్ళు రాత్రి 2 నిమిషాలు ఆలస్యంగా హోటల్‌కు చేరుకున్నారు. ఆ విధంగా, సుఫ్యాన్ ముఖిమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు రూ. 18,000 జరిమానా విధించింది.

ఖైదీ సంఖ్యకు జరిమానా..

పాకిస్తాన్ జట్టు ఫాస్ట్ బౌలర్ అమీర్ జమాల్ పై కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా అమీర్ జమాల్ ‘ఖైదీ నంబర్ 804’ అని రాసిన టోపీని ధరించాడు. జైలులో ఉన్న పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇచ్చాడు. ఇందుకోసం అమీర్ జమాల్‌కు భారీ మొత్తంలో రూ. 14 లక్షలు జరిమానా విధించారు.

మొత్తం మీద, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు జీతాల కోతలు, జరిమానాలతో వార్తల్లో నిలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..