AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Mock Auction : ధోనీ టీమ్ ప్లాన్ రెడీ.. మాక్ ఆక్షన్‌లో ఆ ముగ్గురు డేంజరస్ బౌలర్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసిన CSK

IPL Mock Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ఆక్షన్ రేపు, డిసెంబర్ 16న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరగనుంది. ఈ వేలం కోసం 350 మందికి పైగా ఆటగాళ్ల తుది జాబితా సిద్ధమైంది.

IPL Mock Auction : ధోనీ టీమ్ ప్లాన్ రెడీ.. మాక్ ఆక్షన్‌లో ఆ ముగ్గురు డేంజరస్ బౌలర్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసిన CSK
Csk Captain
Rakesh
|

Updated on: Dec 15, 2025 | 5:58 PM

Share

IPL Mock Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ఆక్షన్ రేపు, డిసెంబర్ 16న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరగనుంది. ఈ వేలం కోసం 350 మందికి పైగా ఆటగాళ్ల తుది జాబితా సిద్ధమైంది. అయితే పది ఫ్రాంచైజీలు గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయగలవు. బిడ్డింగ్‌లో భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.

మినీ ఆక్షన్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఒక మాక్ ఆక్షన్ నిర్వహించింది. ఇందులో టీమిండియా మాజీ దిగ్గజాలు పది ఐపీఎల్ టీమ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతను మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తీసుకున్నారు. రైనా తన టీమ్ కోసం బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

మాక్ ఆక్షన్‌లో సీఎస్కే మొత్తం రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని ముగ్గురు కీలకమైన ఫాస్ట్, స్పిన్ బౌలర్ల కోసం ఖర్చు చేసింది. దీని ద్వారా బౌలింగ్‌పై సీఎస్కే ఎంత ఫోకస్ చేసిందో స్పష్టమవుతోంది. లెగ్ స్పిన్నర్‌ రాహుల్ చాహర్ కు అత్యధికంగా రూ.10 కోట్ల బిడ్ పలికింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్‌ ఎన్రిక్ నార్కియాను రూ.7.50 కోట్లకు టీమ్‌లో చేర్చుకున్నారు.భారత యువ పేసర్‌ శివమ్ మావిని రూ.2.50 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా సీఎస్కే తన పేస్ అటాక్‌ను బ్యాలెన్స్ చేసుకునే వ్యూహాన్ని ప్రదర్శించింది.

అసలు మినీ ఆక్షన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ.43.40 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్‌తో సీఎస్కే గరిష్టంగా 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4 విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. మాక్ ఆక్షన్‌లో రైనా చూపిన విధంగా సీఎస్కే యాజమాన్యం కూడా బౌలింగ్, ఆల్‌రౌండర్లపై ప్రధానంగా దావ్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎస్కే వద్ద ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, సంజూ శాంసన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..