AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్‌ వేలంలోకి వస్తే రూ. 130లకు కూడా కొనరు.. బాబర్ ఆజం‌పై షాకింగ్ కామెంట్స్..

Babar Azam: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 64 పరుగులు మాత్రమే చేశాడు. స్వదేశంలో అత్యంత పేలవమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన బాబర్ ఆజం ఐపీఎల్‌లో కనిపిస్తే రూ.130కి కూడా వేలం వేయరని క్రికెట్ విశ్లేషకుడు వాసే హబీబ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

IPL 2025: ఐపీఎల్‌ వేలంలోకి వస్తే రూ. 130లకు కూడా కొనరు.. బాబర్ ఆజం‌పై షాకింగ్ కామెంట్స్..
Babar Azam
Venkata Chari
|

Updated on: Sep 07, 2024 | 9:14 PM

Share

Babar Azam: పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ట్రోల్ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన అతడు ఇప్పుడు పాక్ అభిమానుల ట్రోల్స్‌కి గురవుతున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు వాసే హబీబ్ మరో అడుగు ముందుకేసి బాబర్ అజామ్ ఐపీఎల్ వేలం మొత్తాన్ని ప్రకటించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 64 పరుగులు మాత్రమే చేశాడు. స్వదేశంలో అత్యంత పేలవమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన బాబర్ ఆజం ఐపీఎల్‌లో కనిపిస్తే రూ.130కి కూడా వేలం వేయరని క్రికెట్ విశ్లేషకుడు వాసే హబీబ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

ఇప్పుడు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాక్ జట్టు కెప్టెన్ ధర రూ.130 మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయమై ట్రోల్ చేస్తున్నారు. కాగా, బాబర్ అజామ్ పేలవ ప్రదర్శన పాక్ క్రికెట్ ప్రేమికుల ఆగ్రహానికి కారణంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే, బాబర్ అజామ్ పాక్ తరుపున ఒక టెస్టులో అర్ధశతకం సాధించి 2 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, అతను నిలకడగా జట్టులో స్థానం పొందుతున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో 64 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలకు గురయ్యాడు. దీని కారణంగా, వాసే హబీబ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో బాబర్ అజామ్‌ను విలువలేని ఆటగాడిగా విమర్శించారు.

ఈ సమీక్ష మధ్య ఐపీఎల్ వేలంలో బాబర్ ఆజం కనిపిస్తే 130 రూపాయలు మాత్రమే వస్తాయని కామెంట్ చేశాడు. అది కూడా రాకపోవచ్చని ఎగతాళి చేశారు. పాకిస్థాన్ క్రికెట్ విమర్శకుల ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనం సృష్టించింది.

ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు అనుమతి లేదు. 2008లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ముంబై దాడుల నుంచి పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి నిషేధానికి గురయ్యారు. పాక్ ఆటగాళ్లపై ఈ నిషేధం ఇంకా కొనసాగుతుండడంతో పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో కనిపించడం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us