IPL-2022: ఇండియాలోనే ఐపీఎల్-2022.. ఒకే నగరంలో నిర్వహిస్తారటా.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022ను భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

IPL-2022: ఇండియాలోనే ఐపీఎల్-2022.. ఒకే నగరంలో నిర్వహిస్తారటా.!
ipl
Follow us

|

Updated on: Jan 22, 2022 | 6:00 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022ను భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మ్యాచ్‌లు మొత్తం ముంబైలో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు బోర్డు కట్టుబడి ఉందని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI తెలిపింది. జనవరి 22 శనివారం బోర్డు, అన్ని ఫ్రాంచైజీ యజమానుల మధ్య సమావేశం జరిగింది. దీనిలో బోర్డు తన ఎంపిక గురించి చెప్పింది. అయితే, పరిస్థితి మరింత దిగజారితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికాలను కూడా ఎంపికలుగా ఉంచారు.

టోర్నమెంట్ మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, డివై పాటిల్ (నవీ ముంబై), బ్రబౌర్న్ స్టేడియం (సీసీఐ)లో మూడు స్టేడియాలలో జరుగుతాయని వార్తా సంస్థ ANI నివేదించింది. దీనితో పాటు, అవసరమైతే, కొన్ని మ్యాచ్‌లను కూడా పూణేలో నిర్వహించవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది బీసీసీఐ భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించింది. అయితే రెండో వేవ్ కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా, బయో-బబుల్‌లో కేసులు రావడం ప్రారంభించాయి. దీంతో 29 మ్యాచ్‌ల తర్వాత టోర్నమెంట్ నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబరు-అక్టోబర్‌లో యూఏఈలో పూర్తయింది.

ఐపీఎల్-2022ను మార్చి 27 నుండి ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు బోర్డు అన్ని ఫ్రాంచైజీ యజమానులకు తెలిపింది. ముందుగా ఏప్రిల్ 2 నుంచి 15వ సీజన్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ విషయాలన్నింటిపై ఫిబ్రవరి 20న జరిగే బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మెగా వేలం తేదీలో ఎలాంటి మార్పు ఉండదని నివేదిక పేర్కొంది. మెగా వేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో మాత్రమే జరుగుతుందని, ఎప్పటిలాగే ఈసారి కూడా బెంగళూరులోనే ఆటగాళ్లను వేలం వేస్తారని బోర్డు ఫ్రాంచైజీ యజమానులకు తెలిపింది. ఈసారి లీగ్‌లో 1,214 మంది ఆటగాళ్లు వేలం కోసం తమను తాము నమోదు చేసుకున్నారు. ఇందులో 896 మంది భారతీయులు, 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

Read Also.. IPL-2022: హార్దిక్ పాండ్యా గొప్ప ఆటగాడు.. ఈ ఐపీఎల్​లో రాణిస్తాడు..