AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: తగ్గేదే..లే.! ఐపీఎల్ సెకండాఫ్‌కు ‘తలా’ రెడీ.. నెట్స్‌ బాదుడే బాదుడు..

ఐపీఎల్ 14వ సీజ‌న్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అవుతుంది చెన్సై సూపర్‌ కింగ్స్‌. దుబాయ్‌ వేదికగా జరగబోతున్న ఈ టోర్నీ కోసం..

MS Dhoni: తగ్గేదే..లే.! ఐపీఎల్ సెకండాఫ్‌కు 'తలా' రెడీ.. నెట్స్‌ బాదుడే బాదుడు..
Dhoni
Ravi Kiran
|

Updated on: Aug 25, 2021 | 9:03 PM

Share

ఐపీఎల్ 14వ సీజ‌న్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అవుతుంది చెన్సై సూపర్‌ కింగ్స్‌. దుబాయ్‌ వేదికగా జరగబోతున్న ఈ టోర్నీ కోసం.. ఇప్పటికే ఏడారి దేశంకు చేరుకుంది చెన్నై సూపర్స్‌ కింగ్స్‌. అయితే తాజాగా సీఎస్‌కే జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, సురేష్‌ రైనా, అంబటి రాయుడు నెట్ ప్రాక్టీస్ చేశారు.

ముగ్గురు బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడుతూ.. మంచి నెట్స్‌లో క‌నిపించారు. సెప్టెంబ‌ర్ 19న చెన్నై, ముంబై మ్యాచ్‌తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ధోనీ, రైనా, రాయుడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో చెన్నై పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నా.. ధోనీ, రైనా పెద్ద‌గా ఆడింది లేదు. దీంతో ఈ ఇద్దరూ మిగిలిపోయిన మ్యాచ్‌ల‌లో రాణించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

కాగా, ఐపీఎల్ సెకండాఫ్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 15 వరకు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. గతేడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను జరుగుతాయి. దుబాయ్‌, అబుదాబీ, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహిస్తారు.