AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. టీమిండియా ఆటగాళ్ల సరికొత్త లుక్స్ చూశారా?

రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ ఉల్లాసకరమైన వాతావరణం రెండో టెస్టుకు ముందు ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

Video: గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. టీమిండియా ఆటగాళ్ల సరికొత్త లుక్స్ చూశారా?
Gautam Gambhir Special Dinner
Venkata Chari
|

Updated on: Oct 09, 2025 | 6:51 AM

Share

Gautam Gambhir: వెస్టిండీస్‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు, సహాయక సిబ్బందికి ఆ జట్టు హెడ్ కోచ్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీలోని తన నివాసంలో బుధవారం రాత్రి ఓ ప్రత్యేక విందు ఇచ్చారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆటగాళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి, ఉల్లాసంగా గడపడానికి గంభీర్ ఈ విందు ఏర్పాటు చేశారు.

ఉల్లాసంగా గడిపిన ఆటగాళ్లు..

గంభీర్ నివాసానికి భారత జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఒక బస్సులో వచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా ఆటగాళ్లంతా సాధారణ దుస్తుల్లో (Casual Wear) కనిపించారు. గిల్ టీ-షర్ట్, బ్లూ డెనిమ్‌తో స్టైలిష్‌గా ఉండగా, జస్‌ప్రీత్ బుమ్రా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వంటి చాలా మంది ఆటగాళ్లు తెల్లటి దుస్తుల్లో వచ్చారు. సహాయక సిబ్బందితో పాటు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ ప్రత్యేక విందుకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

రెండో టెస్టుకు ముందు ఉత్సాహం..

రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ ఉల్లాసకరమైన వాతావరణం రెండో టెస్టుకు ముందు ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ విందు ద్వారా ఆటగాళ్ల మధ్య బంధం మరింత బలపడి, మైదానంలో జట్టుగా మరింత మెరుగ్గా రాణించడానికి తోడ్పడుతుందని గంభీర్ ఆశించారు.

వెస్టిండీస్‌పై సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విందు తర్వాత ఆటగాళ్లు మరింత శక్తిమంతంగా రెండో టెస్టుకు సిద్ధమవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..