ICC Men’s Player of the Month Award: జూన్ 29న టీమిండియా టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ విజయంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బూమ్ బూమ్ బుమ్రాకు ఐసీసీ నుంచి అద్భుతమైన రిటర్న గిఫ్ట్ దక్కింది. బుమ్రా జూన్ 2024 కోసం ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు.
ఈ అవార్డు కోసం బుమ్రా టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్లతో పోటీ పడ్డాడు. వీరిద్దరిని అధిగమించిన బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
30 ఏళ్ల టీమిండియా పేసర్.. USA, కరేబియన్లలో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టి, 4.17 ఎకానమీ రేటుతో అత్యుత్తమ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
India’s bowling maestro caps off a phenomenal month of June with the ICC Men’s Player of the Month Award 🤩
— ICC (@ICC) July 9, 2024
పురుషుల T20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులో విరాట్ కోహ్లీ (రెండుసార్లు విజేత)తో కలిసి భారత ఆటగాడిగా చేరాడు.
“జూన్ నెలలో ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైనందుకు నేను సంతోషిస్తున్నాను. USA, వెస్టిండీస్లో గడిపిన కొన్ని వారాల చిరస్మరణీయమైన రోజుల తర్వాత ఇది నాకు ప్రత్యేక గౌరవం. టోర్నమెంట్లో మేం బాగా ఆడడం, చివర్లో ట్రోఫీని ఎత్తడం చాలా ప్రత్యేకమైనది, నేను ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.
A dream run of form in June fetches India’s star opener the ICC Women’s Player of the Month Award 🏅
— ICC (@ICC) July 9, 2024
ఇక మహిళల విభాగంలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన జూన్ నెలకుగానూ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది. ఇంగ్లాండ్కు చెందిన మైయా బౌచియర్, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నేలను ఓడించిన, లేడీ విరాట్ అంతర్జాతీయ కెరీర్లో మొదటిసారి ఈ అవార్డును దక్కించుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..