AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు జొరావర్‌కు శిఖర్ ధావన్ ఎమోషనల్ మెసేజ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దంటోన్న ఫ్యాన్స్

Shikhar Dhawan Shares Emotional Message for Son Zoravar: శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీల మధ్య 2023లో విడాకులు మంజూరయ్యాయి. విడాకుల సమయంలో ఢిల్లీ కోర్టు అయేషా చేసిన "మానసిక క్రూరత్వం" కారణంగా ధావన్‌కు విడాకులు ఇచ్చింది. అయితే, జొరావర్ కస్టడీ అయేషా వద్దనే ఉంది. ధావన్‌కు పరిమితమైన సందర్శన హక్కులు, వీడియో కాల్స్ ద్వారా సంభాషించే అవకాశం మాత్రమే లభించింది.

కొడుకు జొరావర్‌కు శిఖర్ ధావన్ ఎమోషనల్ మెసేజ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దంటోన్న ఫ్యాన్స్
Shikhar Dhawan Son Zoravar
Venkata Chari
|

Updated on: May 29, 2025 | 8:56 AM

Share

Shikhar Dhawan Shares Emotional Message for Son Zoravar: భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి తరచుగా బహిరంగంగానే మాట్లాడుతుంటాడు. తన కుమారుడు జొరావర్‌తో దూరంగా ఉండటం వల్ల కలిగే మానసిక వేదనను ఆయన పలు సందర్భాల్లో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, జొరావర్‌కు తండ్రిగా ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాడు. ఈ సందేశం ఎంతో భావోద్వేగభరితంగా సాగింది.

“నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే.. తండ్రి ఎప్పుడూ నీతోనే..!”

రానున్న 20 సంవత్సరాల తర్వాత జొరావర్ 31-32 ఏళ్ల వయసులో ఉంటాడని శిఖర్ ధావన్ ఆ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. అప్పుడు తన కుమారుడికి తాను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే అని, అది “నువ్వు ఏది చేసినా సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండటానికి మార్గం నీలోపల వెతుక్కోవడమే. నీ లోపల ఉన్న లోపాలను గుర్తించు, నీ బలాన్ని తెలుసుకో, వాటిని మెరుగుపరచుకో. అంతే, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ శిఖర్ ధావన్ తెలిపాడు.

తన కుమారుడు జొరావర్ తనతో ఇప్పుడు మాట్లాడటం లేదని, అయితే తాను ఆధ్యాత్మికంగా అతనితో కనెక్ట్ అయి ఉన్నానని శిఖర్ ధావన్ గతంలో కూడా వెల్లడించాడు. తాను జొరావర్‌ను కౌగిలించుకుంటున్నట్లు, ప్రేమను పంచుకుంటున్నట్లు భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. జొరావర్ తనతో ఉండాలనుకుంటే, తాను ఎప్పుడూ అతని కోసం ఉంటానని ధావన్ భావోద్వేగంగా తెలిపాడు. ఇది తండ్రిగా తన బాధ్యత అని ఆయన అన్నాడు.

ఇవి కూడా చదవండి

దూరం చేసిన విడాకులు..

శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీల మధ్య 2023లో విడాకులు మంజూరయ్యాయి. విడాకుల సమయంలో ఢిల్లీ కోర్టు అయేషా చేసిన “మానసిక క్రూరత్వం” కారణంగా ధావన్‌కు విడాకులు ఇచ్చింది. అయితే, జొరావర్ కస్టడీ అయేషా వద్దనే ఉంది. ధావన్‌కు పరిమితమైన సందర్శన హక్కులు, వీడియో కాల్స్ ద్వారా సంభాషించే అవకాశం మాత్రమే లభించింది. ఈ పరిమితుల కారణంగా, ధావన్ తన కుమారుడిని కలవడానికి, అతనితో మాట్లాడటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితిలో శిఖర్ ధావన్ పడుతున్న బాధను అతని మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తన కుమారుడికి తండ్రి ప్రేమను పంచుకోవడానికి ఆయన తపిస్తున్న తీరు అందరినీ కదిలిస్తోంది. క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ధావన్.. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న ఈ సవాలును కూడా మానసిక ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు. జొరావర్ ఎప్పటికీ తన గుండెల్లోనే ఉంటాడని, తన ప్రేమ ఎప్పుడూ తన కుమారుడికి ఉంటుందని శిఖర్ ధావన్ సందేశం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..