AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 ఇన్నింగ్స్‌ల్లో 1195 పరుగులు.. ఒక ట్రిపుల్, రెండు డబుల్ సెంచరీలు చేసినా.. టీమిండియాలో చోటు దక్కలే..!

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ గత రంజీ సీజన్ నుంచి పరుగుల వర్షం కురిపించాడు. కానీ, భారత టెస్ట్ జట్టులోకి మాత్రం ఎంపిక కాలేదు.

9 ఇన్నింగ్స్‌ల్లో 1195 పరుగులు.. ఒక ట్రిపుల్, రెండు డబుల్ సెంచరీలు చేసినా.. టీమిండియాలో చోటు దక్కలే..!
Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Feb 21, 2022 | 8:31 PM

Share

సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) రంజీ ట్రోఫీ 2022(Ranji Trophy 2022) ని తుఫాను ఇన్నింగ్స్‌తో ప్రారంభించాడు. ముంబై తరఫున ఆడుతున్న అతను 401 బంతుల్లో 275 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సౌరాష్ట్రపై సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. 2019-20 రంజీ ట్రోఫీలోనూ పరుగుల వర్షం కురిపించాడు. అతను ఆరు మ్యాచ్‌ల్లో 154.66 సగటుతో 928 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో అతని చివరి తొమ్మిది స్కోర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 71 నాటౌట్ (140 బంతుల్లో), 36 (39), 301 నాటౌట్ (391), 226 నాటౌట్ (213), 25 (32), 78 (126), 177 ( 210), 6 (9), 275 (401). అయితే ఇన్ని పరుగులు చేసిన తర్వాత కూడా అతడికి భారత టెస్టు జట్టు(Indian Cricket Team) నుంచి ఇంకా పిలుపురాలేదు. ఇటీవల, శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాను ప్రకటించిన జట్టులోనూ సర్ఫరాజ్ ఖాన్ పేరు కనిపించలేదు. అతని తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ దీనిపై నిరాశ చెందారు. అయితే త్వరలో సర్ఫరాజ్‌కు స్థానం లభిస్తుందని అతను ఆశిస్తున్నాడు.

ఎవరీ సర్ఫరాజ్.. భారతదేశం అత్యంత సమర్థ బ్యాట్స్‌మెన్‌లలో సర్ఫరాజ్ పేరు ఒకప్పుడు లెక్కించారు. అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండుసార్లు ఆడాడు. 2018లో జరిగిన ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నిలబెట్టుకుంది. కానీ, పరుగులు చేయడంలో విఫలమైన తర్వాత అతడిని మర్చిపోయారు. దీని తర్వాత, 2019-20 రంజీ ట్రోఫీకి ముందు, సర్ఫరాజ్ UPని విడిచిపెట్టి, ముంబైని మళ్లీ తన జట్టుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఆటగాడు వెనుదిరిగి చూడలేదు.

సెలక్టర్లను మనం గౌరవించాలి. అవును, అతని పేరు జట్టులో లేకపోవడం నిరాశపరిచింది. అయితే ఇది తన మనసుపై ప్రభావం చూపబోదని, ముంబై తరఫున పరుగులు చేయడంపైనే దృష్టి సారిస్తాడని సర్ఫరాజ్ తండ్రి చెప్పుకొచ్చాడు. తద్వారా భారత జట్టులో చోటు సంపాదించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.

కరోనా పీరియడ్‌లో కూడా తీవ్రంగా ప్రాక్టీస్.. కరోనా కాలంలో పెద్ద టోర్నమెంట్‌లు ఆగిపోయినప్పటికీ, 24 ఏళ్ల సర్ఫరాజ్ తనను తాను మైదానానికి దూరంగా ఉంచలేదు. తన తండ్రితో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలను సందర్శించి అక్కడ అనేక టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. నౌషాద్ మాట్లాడుతూ, ‘లాక్‌డౌన్ సమయంలో మేం చాలా ప్రయాణించాం. ఇది అంత సులభం కాదు. కానీ, ఉన్నత స్థాయికి సిద్ధంగా ఉండాలనే సంకల్పం మాకు సహాయపడింది. యూపీలో చాలా ప్రాంతాలకు వెళ్లాం. అజంగఢ్‌లో కూడా సిద్ధమైంది. మేం ప్రత్యేక టర్ఫ్, సింథటిక్ బంతులతో గంటలు, రోజులు, నెలల పాటు సాధన చేసాం. స్వింగ్, స్పిన్, సీమ్ అన్ని విధాలుగా సర్ఫరాజ్‌ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీజ్ చేశాడని తెలిపాడు. తన కొడుకును భారత జట్టులో ఆడించాలని నౌషాద్ కలలు కంటున్నాడు. అది తీరేవరకు శ్రమిస్తూనే ఉంటామని తెలిపాడు.

Also Read: T20 World Cup: అరంగేట్రంలోనే సూపర్ సెంచరీ.. 66 బంతుల్లోనే బాదేసిన 22 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. సొంతమైన వరల్డ్ రికార్డు

T20 World Cup 2022: టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలు పూర్తి.. జట్టు బ్యాలెన్స్ ఒక్కటే పెండింగ్: ద్రవిడ్