INDvSA: స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో భారత మహిళా క్రికెెట్ టీమ్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో

INDvSA: స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా
స్మృతి మంధనా అద్భుత ఇన్నింగ్స్
Follow us

|

Updated on: Mar 09, 2021 | 4:13 PM

Smriti Mandhana:  దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో భారత మహిళా క్రికెెట్ టీమ్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరింత పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఆడి ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో మిథాలీసేన ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత టీమ్ కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది. దీనితో, ఇరు జట్ల మధ్య 5 వన్డే సిరీస్ ఇప్పుడు మరోసారి సమానంగా ఉంది. మొదటి 2 మ్యాచ్‌ల తరువాత, ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమానంగా ఉంది.

టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన (80), పూనమ్​ రౌత్​ (60) చెరో అర్ధశతకంతో  దుమ్మరేపారు. అద్భుత షాట్లతో అలరించి.. సునాయాస విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా విమెన్స్ టీమ్ 41 ఓవర్లలో 157 పరుగుల చేసి ఆలౌట్​ అయ్యింది. భారత బౌలర్లు గోస్వామి 4 వికెట్లతో చెలరేగగా.. గైక్వాడ్​(3), మానసి జోషీ (1) వికెట్లు పడగొట్టారు.

చితక్కొట్టిన స్మృతి మంధనా

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధనా తన ఇన్నింగ్స్‌ను 2 బ్యాక్ టు బ్యాక్‌ సిక్సర్లతో ప్రారంభించింది. అదే దూకుడుతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని క్లాసిక్ ఫోర్లు  మంధనా బ్యాట్ నుంచి జాలువారాయి. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధనా 64 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆమె ఇన్సింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

అదరగొట్టిన పూనమ్ రౌత్

మరొక వైపు నుంచి, పూనం రౌత్ కూడా అదరగొట్టింది. సెంచరీ భాగస్వామ్యంలో మంధనకు ఆమె మంచి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే పూనమ్ 14 వ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.  ఆమె 89 బంతుల్లో 62 పరుగులు చేశారు. అందులో 8 ఫోర్లు ఉన్నాయి.

 దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బారత బౌలర్లు

అంతకుముందు రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లఖ్​నవూ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను స్థిరంగా ఆడనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికాను పూర్తిగా 50 ఓవర్లు కూడా ఆడనివ్వలేదు. ఫలితంగా, 41 ఓవర్లలో 157 పరుగులు చేసిన విజిటింగ్ జట్టు ఆలౌట్ అయింది. భారత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.

దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!