AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన జైస్వాల్- దూబే.. 2వ టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్‌ కైవసం..

ఈ క్రమంలో యశస్వి తన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. ఇలా ఈ యువ ఓపెనర్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి వికెట్ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే గత మ్యాచ్ నుంచి ఫామ్ కొనసాగించి ఈసారి మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈసారి మహ్మద్ నబీ ఓవర్‌లో దూబే వరుసగా 3 సిక్సర్లు కొట్టి మైదానం మొత్తాన్ని హోరెత్తించాడు. తద్వారా దూబే కేవలం 22 బంతుల్లోనే వరుసగా రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 42 బంతుల్లో 92 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

IND vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన జైస్వాల్- దూబే.. 2వ టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్‌ కైవసం..
Ind Vs Afg 2nd T20i
Venkata Chari
|

Updated on: Jan 15, 2024 | 6:37 AM

Share

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య జరిగిన 3 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన యువ ప్లేయర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), శివమ్ దూబే (Shivam Dube)ల హాఫ్ సెంచరీల కారణంగా 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

28 బంతుల్లో హాఫ్ సెంచరీ..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఓపెనర్లు వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ, గుల్బాదిన్ నైబ్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఎవరూ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోయారు. మూడో స్థానానికి ప్రమోట్ అయిన ఆల్ రౌండర్ గుల్బాదిన్ భారత బౌలర్లపై విరుచుకుపడి కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, 12వ ఓవర్‌లో నైబ్‌ను అవుట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ భారత్‌కు అవసరమైన వికెట్ ఇచ్చాడు. చివరగా నాయబ్ కేవలం 35 బంతుల్లో 57 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

172 పరుగుల లక్ష్యం..

నైబ్ తప్ప జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ జట్టుకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. 17వ ఓవర్ వరకు ఆఫ్ఘనిస్థాన్ స్కోరు కేవలం 134 పరుగులు మాత్రమే. అయితే, ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ బౌలర్లు కరీం జనత్ కేవలం 10 బంతుల్లో 20 పరుగులు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి జట్టును 172 పరుగులకు చేర్చారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా, మిగతా రెండు వికెట్లు రనౌట్‌ల ద్వారా వచ్చాయి.

రోహిత్ మళ్లీ విఫలం..

ఈ లక్ష్యాన్ని ఛేదించిన యశస్వి జైస్వాల్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు శుభారంభం అందించాడు. కానీ, అదే ఓవర్ మూడో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో సున్నా వికెట్లు తీసిన కెప్టెన్ రోహిత్ రెండో మ్యాచ్‌లోనూ జీరోకే తన వికెట్ కోల్పోయాడు. దీంతో అతని ఖాతాలో మరో చెత్త రికార్డ్ వచ్చి చేరింది.

జైస్వాల్-శివమ్ దూబే హాఫ్ సెంచరీలు..

రోహిత్ వికెట్ పతనం తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్, రెండో ఓవర్‌లో స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను 2 బౌండరీలు కొట్టి సెలెక్టర్లకు తగిన సమాధానం ఇచ్చాడు. మరోవైపు, యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఫజల్‌హక్ ఫరూఖీ ఓవర్‌లో 2 సిక్సర్లు, ముజీబ్ ఓవర్‌లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. కానీ అంతలోనే 16 బంతుల్లో 29 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. నవీన్ ఉల్ హక్ చేతికి చిక్కాడు.

22 బంతుల్లో వరుసగా రెండో అర్ధశతకం..

ఈ క్రమంలో యశస్వి తన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. ఇలా ఈ యువ ఓపెనర్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి వికెట్ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే గత మ్యాచ్ నుంచి ఫామ్ కొనసాగించి ఈసారి మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈసారి మహ్మద్ నబీ ఓవర్‌లో దూబే వరుసగా 3 సిక్సర్లు కొట్టి మైదానం మొత్తాన్ని హోరెత్తించాడు. తద్వారా దూబే కేవలం 22 బంతుల్లోనే వరుసగా రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 42 బంతుల్లో 92 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. జైస్వాల్ ఔటైన తర్వాత వచ్చిన జితేష్ శర్మ కూడా ముందుగానే నిష్క్రమించాడు. అయితే, మరోసారి దూబేతో కలిసి రింకూ సింగ్ 15.4 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు.