AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs WI 3rd ODI: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. రాణించిన శ్రేయస్, పంత్, ప్రసిద్ధ్, సిరాజ్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది...

Ind vs WI 3rd ODI: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. రాణించిన శ్రేయస్, పంత్, ప్రసిద్ధ్, సిరాజ్
India Players
Srinivas Chekkilla
|

Updated on: Feb 11, 2022 | 9:31 PM

Share

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు. కష్టల్లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. రిషబ్ బంత్ 54 బంతుల్లో 56(ఆరు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ పంత్ ఔట్ చేశాడు. దీంతో శ్రేయస్, పంత్‌ల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు.

క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తో్న్న శ్రేయస్ అయ్యర్‌ను వాల్ష్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్ దాటిగా ఆడాడు. 38 బంతుల్లో 38(4 ఫోర్లు, 2 సిక్స్)పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు, జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. అలెన్, స్మిత్ చేరో వికెట్ పడగొట్టారు.

266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ ఏ దశలోను విజయం సాధించేలా కనిపించ లేదు. క్రమం తప్పుకుండా వికెట్లు కోల్పోయింది. 169 పరుగులకు ఆలౌట్ అయింది. ఒడియన్ స్మిత్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ 34 పరుగులు చేశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు పడగొట్టారు. దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ రెండు చొప్పున వికెట్లు తీశారు. కలకోత్తాలో వెస్టిండీస్, భారత్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది.

Read Also.. IPL 2022 Auction: ఈ 5గురిపైనే హైదరాబాద్ చూపు.. వార్నర్ స్థానం భర్తీ చేసేదెవరు.. కొత్త జెర్సీతోనైనా లక్ మారేనా?