AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 3 దేశాలతో 8 వన్డేలు.. ఒకే ఒక్క విజయం టీమిండియా సొంతం.. రికార్డులు చూస్తే పరేషానే..!

భారీ ఆశలతో టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడ చరిత్ర సృష్టించాలనే ఆశలు కాస్త చెడిపోయాయి. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. మరోసారి ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Team India: 3 దేశాలతో 8 వన్డేలు.. ఒకే ఒక్క విజయం టీమిండియా సొంతం.. రికార్డులు చూస్తే పరేషానే..!
Team India
Venkata Chari
|

Updated on: Jan 22, 2022 | 2:28 PM

Share

India Vs South Africa: భారీ ఆశలతో టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడ చరిత్ర సృష్టించాలనే ఆశలు కాస్త చెడిపోయాయి. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. మరోసారి ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్ల్‌లో జరిగిన తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య జట్టు 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని పొందాల్సి వచ్చింది. మూడో వన్డేలోనూ పరిస్థితి మారకపోతే వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ను కూడా ఎదుర్కోక తప్పదు.

3 దేశాలు, 8 వన్డేలు, 1 విజయం.. దక్షిణాఫ్రికాలో ఓడిపోయిన వన్డే సిరీస్ ఆసియా వెలుపల భారత్‌కి వరుసగా మూడో వన్డే సిరీస్ ఓటమి. అంతకుముందు న్యూజిలాండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలొకొంది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో కోల్పోయింది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. ఈ మూడు సిరీస్‌ల గణాంకాలు 2019 ప్రపంచకప్ తర్వాతే వచ్చినవే. అంటే 2019 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో భారత్ ఆడిన 8 వన్డేల్లో ఒక్క విజయం మాత్రమే దక్కింది. కాగా 7 మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

స్వదేశం వెలుపల ఆడిన చివరి 11 వన్డేల గురించి మాట్లాడితే, భారత్ 3 మాత్రమే గెలిచింది. అంటే 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2019 ప్రపంచకప్ తర్వాత ఈ గణాంకాలు విదేశీ మైదానాల్లో యాభై ఓవర్ల ఫార్మాట్‌లో భారత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తున్నాయి.

ఈ నష్టానికి కారణం పెద్దదే..! విదేశీ మైదానాల్లో టీమిండియా ప్రదర్శన కూడా అలానే తయారైంది. గత 2 సంవత్సరాల భారత బౌలర్ల రిపోర్ట్ కార్డ్‌ను పరిశీలిస్తే, వారు పవర్‌ప్లేలో అంటే మొదటి 10 ఓవర్లలో ఘోరంగా విఫలమయ్యారు. 2020 సంవత్సరం తర్వాత, పవర్‌ప్లేలో భారత బౌలర్ల సగటు 123కాగా, వారు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమికి ప్రధాన కారణం పవర్‌ప్లేలో భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోవడం. న్యూజిలాండ్‌లో క్లీన్‌స్వీప్‌కు కూడా ఇదే కారణంగా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫామ్‌లో లేడు.

కీలక సమస్యగా మిడిలార్డర్‌..! మిడిల్ ఆర్డర్ సమస్య, దీర్ఘకాలికంగా సాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మిడిల్ ఆర్డర్ ఘోర పరాజయం పాలైంది. ఇది సిరీస్ ఓటమికి, విజయానికి మధ్య చాలా తేడా ఉంచేలా చేసింది. లోయర్ ఆర్డర్‌లో ఆడిన శార్దూల్ ఠాకూర్ భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా భారత్ మిడిల్ ఆర్డర్ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో విజయం సాధించడంలో భారత్ క్లీన్ స్వీప్ కాకుండా బయటపడింది. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో ఓటమిని తప్పించుకుని దక్షిణాఫ్రికాలో క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోగలదా అనేది చూడాలి.

Also Read: IPL 2022 Mega Auction: షమీ నుంచి బౌల్ట్ వరకు.. వేలంలో కాసుల వర్షం కురిపించే బౌలర్లు ఎవరంటే?

IPL 2022: ఐపీఎల్ 2022లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌‌గా మారిన భారత ఓపెనర్.. కోహ్లీ, రోహిత్‌లు వెనుకంజలోనే..