AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత జట్టుకు అభినందనలు తెలిపిన గంగూలీ.. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండంటూ ట్వీట్..

సెంచూరియన్ టెస్టులో భారత్ గెలుపుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. జట్టుకు అభినందనలు తెలిపాడు.

IND vs SA: భారత జట్టుకు అభినందనలు తెలిపిన గంగూలీ.. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండంటూ ట్వీట్..
Ganguly
Srinivas Chekkilla
|

Updated on: Dec 31, 2021 | 3:55 PM

Share

సెంచూరియన్ టెస్టులో భారత జట్టు గెలుపుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. జట్టుకు అభినందనలు తెలిపాడు. అయితే సౌరవ్ గంగూలీకి కరోనా సోకడంతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.

జట్టు విజయం తర్వాత సౌరవ్ గంగూలీ ఈ విజయంతో ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పాడు. “టీమ్ ఇండియాకు గొప్ప విజయం సాధించింది. ఫలితం చూసి ఆశ్చర్యపోనక్కర్లేదు. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండి” ఈ సిరీస్‌కు ముందు, కెప్టెన్సీ విషయంలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం తలెత్తింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమిండియా చరిత్ర సృష్టిస్తుందని సిరీస్‌కు ముందు గంగూలీ చెప్పాడు.

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా 40వ టెస్టు విజయం సాధించింది. కెప్టెన్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక విజయాల పరంగా కోహ్లీ ఇప్పుడు గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) కోహ్లీ కంటే ముందున్నారు. ఇరు దేశాల మధ్య తదుపరి మ్యాచ్ జనవరి 3 నుంచి జోహనెస్‎బర్గ్‌లో జరగనుంది.

Read Also..  BCCI President: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సౌరవ్ గంగూలీ.. ఇంట్లోనే చికిత్స..