AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: రావల్పిండిలో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ..

Ind vs Pak, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో జూన్ 9న హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది. అయితే న్యూయార్క్‌కు సుమారు 11 వేల కిలోమీటర్ల దూరంలోని రావల్పిండిలో, రెండు జట్ల మధ్య పోటీని అభిమానులు కూడా చూడనున్నారు. దీనికి ఐసీసీ ఆమోదం తెలిపింది.

IND vs PAK: రావల్పిండిలో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ..
India Vs Pakistan
Venkata Chari
|

Updated on: May 26, 2024 | 3:04 PM

Share

Ind vs Pak, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో జూన్ 9న హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది. అయితే న్యూయార్క్‌కు సుమారు 11 వేల కిలోమీటర్ల దూరంలోని రావల్పిండిలో, రెండు జట్ల మధ్య పోటీని అభిమానులు కూడా చూడనున్నారు. దీనికి ఐసీసీ ఆమోదం తెలిపింది. రావల్పిండిలో ఫ్యాన్ పార్క్ నిర్మించనున్నట్లు ICC ధృవీకరించింది. ఇక్కడ అభిమానులు పెద్ద స్క్రీన్‌పై రెండు జట్ల మధ్య ఘర్షణను ఆస్వాదించవచ్చు.

ఐసీసీ కీలక ప్రకటన..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ప్రసారం కోసం రికార్డు సంఖ్యలో ఫ్యాన్ పార్క్‌లను ప్రకటించింది. ఇందులో ఐదు వేర్వేరు దేశాలలో తొమ్మిది ప్రత్యక్ష సైట్‌లు ఉంటాయి. న్యూయార్క్, న్యూఢిల్లీ, రావల్పిండితో సహా అనేక ప్రదేశాలలో మొత్తం 22 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రదర్శించనున్నారు.

ICC ప్రకారం, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ A మ్యాచ్ 10 వేర్వేరు ఫ్యాన్ పార్కులలో ప్రదర్శించనున్నారు. రావల్పిండి ఫ్యాన్ పార్క్ మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఓపెన్ కానుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత 60 నిమిషాల పాటు తెరిచి ఉంటుంది. జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో 55 మ్యాచ్‌లు 9 వేర్వేరు ప్రదేశాల్లో జరగనున్నాయి.

న్యూయార్క్‌కు బయలుదేరిన భారత జట్టు..

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. కాగా, బాబర్ అజామ్ జట్టు జూన్ 6న ఆతిథ్య అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో పాక్ జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుండగా, ప్రపంచకప్‌ కోసం భారత జట్టు నిన్న న్యూయార్క్‌ బయలుదేరింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..