AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: 5 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి కోహ్లీ రీఎంట్రీ.. విఫలమైతే ప్లేస్‌ కష్టమే..

Virat Kohli: టీ20 సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో 5 నెలల తర్వాత కోహ్లి టీ20 ఇంటర్నేషనల్‌కి తిరిగి వస్తున్నాడు.

IND vs ENG: 5 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి కోహ్లీ రీఎంట్రీ.. విఫలమైతే ప్లేస్‌ కష్టమే..
Rohit Sharma, Virat Kohli
Venkata Chari
|

Updated on: Jul 08, 2022 | 8:05 PM

Share

భారత్-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఐదు నెలల తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రాబోతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. కోహ్లి పునరాగమనంతో ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో రాణించి, తన సత్తా చూపించాల్సి ఉంటుంది. లేదంటే, మరోసారి విమర్శలు పాలయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2022లో కూడా వారు సమర్థవంతంగా రాణించలేకపోయారు. ఐదు నెలల తర్వాత కోహ్లి టీ20 ఇంటర్నేషనల్‌కి తిరిగి వస్తున్నాడు. కాబట్టి మంచి ప్రదర్శన చేయాలనే ఒత్తిడి ఆయనపై ఉంటుంది. అతని పేలవమైన ఫామ్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది కోహ్లీ ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడడం గమనార్హం. ఈ మ్యాచ్‌లు వెస్టిండీస్‌తో జరిగాయి. కోల్‌కతాలో జరిగిన ఒక మ్యాచ్‌లో కోహ్లి 17 పరుగులు, మరో మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు. కానీ, ఐపీఎల్‌లో అంతగా రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో మూడు లేదా నాలుగు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కోహ్లీ చాలా కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు.