MSK Prasad: తుది జట్టుకు హనుమ విహారిని ఎంపిక చేయడం కష్టం.. శ్రేయాస్ అయ్యర్‎తో పోటీ ఉంటుంది..

దక్షిణాఫ్రికాతో జరిగే 3-టెస్టుల సిరీస్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌కు హనుమ విహారిని ఎంపిక చేయడం కష్టమని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ అన్నారు...

MSK Prasad: తుది జట్టుకు హనుమ విహారిని ఎంపిక చేయడం కష్టం.. శ్రేయాస్ అయ్యర్‎తో పోటీ ఉంటుంది..
Anuma Vihari
Follow us

|

Updated on: Dec 12, 2021 | 10:03 AM

దక్షిణాఫ్రికాలో జరిగే 3-టెస్టుల సిరీస్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌కు హనుమ విహారిని ఎంపిక చేయడం కష్టమని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ అన్నారు. indiatoday.inతో మాట్లాడిన MSK ప్రసాద్, ఇటీవల ముగిసిన 2-టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఆడే అవకాశం హనుమ విహారికి అర్హుడని, అయితే భారత్ Aతో దక్షిణాఫ్రికాలో పర్యటించే అవకాశం తనకు మేలు చేసిందని హైలైట్ చేశాడు. వీరోచిత సిడ్నీ టెస్ట్ డ్రాలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన విహారి, న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. చివరి క్షణంలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత్ A జట్టులో చేర్చారు.

దక్షిణాఫ్రికా Aతో బ్లూమ్‌ఫోంటైన్‌లో జరిగిన అనధికారిక టెస్టుల్లో విహారి వరుసగా 3 అర్ధశతకాలు బాదిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో విహారి భారత జట్టులో భాగమయ్యాడు. కానీ 25 ఏళ్ల యువకుడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. విహారిని స్వదేశీ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఆదే సమయంలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం పొందిన శ్రేయాస్ అయ్యర్, తన టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ కొట్టి మేనేజ్‌మెంట్‎తు ఎంపికను కఠినం చేశాడు. 18 మంది సభ్యుల జట్టులో అయ్యర్, విహారి ఇద్దరికి చోటు కల్పించారు. వైస్ కెప్టెన్ కోల్పోయిన అజింక్య రహానే కూడా దక్షిణాఫికా పర్యటనకు ఎంపికయ్యాడు.

” విహరి స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ కోసం జట్టులో చోటుకి అర్హుడు. అతనికి అవకాశం లభించకపోవడంతో అతనిని ఇండియా A టూర్‌కు పంపి ఉంటారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు 2వ అనధికారిక టెస్టులో రాణించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో జరిగిన ఎవే సిరీస్‌లలో బాగా రాణించాడు. హనుమ విహారిని ఆడించాలని.” ప్రసాద్ అన్నాడు. ” ప్లేయర్ నుండి వారు ఏమి ఆశిస్తున్నారు, అతను పోషించబోయే పాత్రపై చాలా ఆధారపడి ఉంటుంది. హనుమ విహారి తన టెక్నిక్‌లో పదిలంగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా, శ్రేయాస్ అయ్యర్ కొంచెం దూకుడు తీసుకురాగల వ్యక్తి. అని చెప్పాడు.

మహమ్మద్ సిరాజ్‌ భవిష్యత్తులో భారత పేస్ అటాక్‌లో కీలక పాత్ర పోషిస్తాడని MSK ప్రసాద్ తెలిపాడు. పేస్ యూనిట్‌లో మహ్మద్ సిరాజ్ నం. 1, 2 స్థానాలకు పోటీపడతాడని చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టు కోసం XIలో ఎంపిక చేయని సిరాజ్‎ను ముంబై టెస్ట్‎కు తీసుకున్నారు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో 3 టెస్టులు ఆడనున్న భారత్, ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది.

Read Also…  Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు అప్పుడే చెప్పా.. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటావని..