AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : భారత్-పాక్ మ్యాచ్‌ టికెట్ల రేటు చూసి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్.. ఏకంగా 60రెట్లు ఎక్కువట

ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని కొందరు భారత అభిమానులు కోరుకుంటున్నప్పటికీ, టికెట్ల కోసం డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అంతకంటే ముందుగానే ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి.

Asia Cup 2025 : భారత్-పాక్ మ్యాచ్‌ టికెట్ల రేటు చూసి ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్.. ఏకంగా 60రెట్లు ఎక్కువట
India Pakistan
Rakesh
|

Updated on: Aug 28, 2025 | 6:30 PM

Share

Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని కొందరు భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయినా కూడా మరో వైపు టికెట్ల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అంతకంటే ముందుగానే ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి. ఇన్సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్ టికెట్లు ఏకంగా రూ.15.75 లక్షల వరకు అమ్ముడవుతున్నాయి. అయితే, నిర్వాహకుల ప్రకారం.. అధికారిక టికెట్ల అమ్మకాలు త్వరలోనే సాధారణ ధరలకు ప్రారంభమవుతాయి.

బ్లాక్ మార్కెట్‌లో భారత్-పాక్ టికెట్లు

గల్ఫ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల అమ్మకాలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతాయని ఒక అధికారి చెప్పారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ కూడా అభిమానులను అనధికారిక వెబ్‌సైట్‌ల నుంచి టికెట్లు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, ECB టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన తర్వాత అధికారిక ఛానెల్‌ల నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించాయని ఆయన అన్నారు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా అధికారికంగా టికెట్లు విడుదల చేయనప్పటికీ, కొన్ని థర్డ్-పార్టీ సైట్‌లు వాటిని ఇప్పటికే అమ్మకానికి పెట్టాయి. ఈ సైట్‌లలో టికెట్ల ధరలు రూ.26,256 (AED 1,100) నుంచి రూ.15.75 లక్షల (AED 66,000) వరకు ఉన్నాయి. అభిమానులు ఈ మోసపూరిత సైట్‌లకు బలికావద్దని సూచించారు.

భారత్-పాక్ మధ్య మూడు మ్యాచ్‌లు సాధ్యమే

సెప్టెంబర్ 21న జరిగే సూపర్-4 మ్యాచ్‌ల కోసం కూడా టికెట్లు ఇప్పటికే అమ్ముడవుతున్నాయి. ఒకవేళ భారత్, పాకిస్తాన్ రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే, సెప్టెంబర్ 28న ఫైనల్‌లో మూడోసారి తలపడే అవకాశం ఉంది. అనధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో భారత్ వర్సెస్ యూఏఈ, భారత్ వర్సెస్ ఒమన్ మ్యాచ్‌ల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

పాకిస్తాన్ హాకీలో ఆసియా కప్ కోసం భారత్‌కు రానని నిరాకరించినప్పటికీ, భారత ప్రభుత్వం క్రికెట్ జట్టుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల ఏసియా కప్ 2025, మహిళల ప్రపంచ కప్ 2025, టీ20 ప్రపంచ కప్ 2026 వంటి మల్టీనేషనల్ టోర్నమెంట్‌లలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు న్యూట్రల్ వేదికలలో జరుగుతాయి.

ఆసియా కప్ తర్వాత, భారత మహిళల జట్టు అక్టోబర్ 5న కొలంబోలో మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. అలాగే, భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో ఒక న్యూట్రల్ వేదికపై ఆడుతుంది. భవిష్యత్తులో భారత్ vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ న్యూట్రల్ ప్రదేశాలలోనే జరుగుతాయని బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించాయి.