AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టార్గెట్ 493.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఛేజింగ్.. రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్.. సీన్ కట్‌చేస్తే..

India vs Australia: ప్రస్తుతం క్రికెట్‌లో టీమిండియా సీజన్ నడుస్తోంది. 2023 సంవత్సరంలో భారత జట్టు ఇప్పటివరకు ప్రతి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. భారీ విజయాలతో ప్రపంచ రికార్డు సృష్టించింది.

Team India: టార్గెట్ 493.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఛేజింగ్.. రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్.. సీన్ కట్‌చేస్తే..
On This Day In Cricket
Venkata Chari
|

Updated on: Feb 03, 2023 | 10:16 AM

Share

India vs Australia Test Series: ప్రస్తుతం క్రికెట్‌లో టీమిండియా సీజన్ నడుస్తోంది. 2023 సంవత్సరంలో భారత జట్టు ఇప్పటివరకు ప్రతి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. భారీ విజయాలతో ప్రపంచ రికార్డు సృష్టించింది. రెండు నెలల్లో రెండు దేశాలను మడతపెట్టేసిన టీమిండియా.. ఇప్పుడు మూడో జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే 45 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన చరిత్రలో నమోదైంది. భారత జట్టు 1978 సంవత్సరంలో ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయింది. ఇదే రోజున టీమిండియా చరిత్రలో ఓ సీన్ రికార్డైంది.

అడిలైడ్ టెస్టులో నిర్ణయాత్మక పోరు..

1978లో అడిలైడ్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ టెస్టులో బిషన్ సింగ్ బేడీ నేతృత్వంలోని భారత జట్టు బాబ్ సింప్సన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి 4 మ్యాచ్‌లు ఖరారయ్యాయి. దీంతో సిరీస్ 2-2తో నిలిచింది. అటువంటి పరిస్థితిలో, చివరి టెస్ట్ ఒక విధంగా నిర్ణయాత్మక పోరు లాంటిది. దాని ఫలితం 1978 ఫిబ్రవరి 3న వెలువడింది. అంటే అప్పటి టెస్టు మ్యాచ్‌లు 5 రోజులకు బదులు 6 రోజుల పాటు జరిగేవి.

45 ఏళ్ల క్రితం మిస్సైన ఛేజింగ్ రికార్డ్..

అడిలైడ్ వేదికగా జరుగుతున్న సిరీస్‌లోని చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 269 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 256 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌కు 493 పరుగుల విజయ లక్ష్యం లభించింది. కానీ, భారత జట్టు లక్ష్యానికి 47 పరుగుల దూరంలో నిలిచింది. కేవలం 445 పరుగులు మాత్రమే చేసింది. ఆ రోజున భారత్ ఆ లక్ష్యాన్ని సాధించి ఉంటే, ఈ రోజు కూడా సాటిలేని రికార్డును కొనసాగించి ఉండేది. ఎందుకంటే ఇప్పటివరకు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద స్కోరు ఛేజ్ జరగలేదు.

ఇవి కూడా చదవండి

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పరుగుల ఛేజింగ్ రికార్డు ప్రస్తుతం వెస్టిండీస్ పేరిట (418 పరుగులు) ఉంది. 2003 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై ఈ స్కోర్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..