AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: కొలంబో టెస్టులో సోనాల్ సెంచరీ వృథా.. శ్రీలంకకు ఫాలోఆన్ విధించిన టీమిండియా

IND vs SL రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగులకే ముగిసింది. సోనాల్ దినుషా వరుసగా రెండో టెస్టు సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. భారత్ 213 పరుగుల ఆధిక్యంతో శ్రీలంకకు ఫాలోఆన్ విధించింది. అరంగేట్ర స్పిన్నర్ సారాంశ్ జైన్ కీలక వికెట్లతో మెరిశాడు. ఇప్పుడు భారత్ ఇన్నింగ్స్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.

IND vs SL: కొలంబో టెస్టులో సోనాల్ సెంచరీ వృథా.. శ్రీలంకకు ఫాలోఆన్ విధించిన టీమిండియా
Sonal Dinusha
Rakesh
|

Updated on: Aug 26, 2026 | 11:15 AM

Share

IND vs SL: కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు శ్రీలంకపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. నాలుగో రోజు ఆటలో లంక తొలి ఇన్నింగ్స్‌ను 290 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా, ప్రత్యర్థిపై 213 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. దీంతో భారత్ ఫాలోఆన్ విధించగా శ్రీలంక మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ముందురోజు 265/8 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకను యువ ఆల్రౌండర్ సోనాల్ దినుషా ఒంటరి పోరాటంతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అద్భుతమైన బౌండరీతో 147 బంతుల్లో తన కెరీర్‌లో వరుసగా రెండో టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో నిగ్రహంతో బ్యాటింగ్ చేస్తూ లంక జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమించాడు.

అరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ సారాంశ్ జైన్ ఈ ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లతో మెరిసాడు. ఇన్నింగ్స్ చివర్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన లహిరు కుమారా (12)ను జైన్ అద్భుతమైన ఫ్లైటెడ్ డెలివరీతో బురిడీ కొట్టించాడు. కవర్ పాయింట్‌లో ధ్రువ్ జురెల్ చక్కటి క్యాచ్ పట్టడంతో సారాంశ్ జైన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి వికెట్ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత సెంచరీ హీరో సోనాల్ దినుషా (103)ను కూడా జైన్ ఔట్ చేయడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది.

ఇది కూడా చదవండి:Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 213 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా శ్రీలంకను ఫాలోఆన్ ఆడాల్సిందిగా ఆదేశించింది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి లంక ఓపెనర్లు లాహిరు ఉదార, కామిల్ మిషారా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను ప్రారంభించారు. భారత వేగవంతమైన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ లంక రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను వేస్తూ వికెట్ల వేట ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి:Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్ మండిపాటు

తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తో వైట్‌వాష్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. మైదానంలో స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ పరిస్థితులను వాడుకుంటూ త్వరగా వికెట్లు తీసి ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో ముగించేందుకు భారత బౌలర్లు వ్యూహాలు రచిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us