IND vs SL 2nd Test: సరికొత్త బ్రహ్మాస్త్రంతో బరిలోకి టీమిండియా.. డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదిగో..!
IND vs SL 2nd Test: శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతోంది. తొలి టెస్టు గెలిచిన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. కొలంబోలో స్పిన్ అనుకూల పిచ్పై కుల్దీప్ యాదవ్ స్థానంలో 33 ఏళ్ల ఆల్ రౌండర్ సారాంశ్ జైన్కు అవకాశం కల్పించే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. జైన్ అరంగేట్రంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది.

IND vs SL 2nd Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ గాలే టెస్టులో శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన భారత జట్టు, ఇప్పుడు సిరీస్ను కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. స్పిన్ అస్త్రంతో భారత బ్యాట్స్మెన్ను దెబ్బ తీయాలని ప్రయత్నించిన శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా, కొలంబోలో జరగనున్న రెండో టెస్టులో మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. తొలి టెస్టులో మానవ్ సుతార్ 10 వికెట్లతో అరంగేట్రంలోనే ఆకట్టుకోగా, ఇప్పుడు రెండో టెస్టులో భారత్ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈసారి స్క్వాడ్లో మరో ఆల్ రౌండర్ అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం.
శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించిన భారత జట్టు రెండో టెస్టుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ సెంచరీ మోత, ఆపై మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలంతో అలవోకగా గెలుపొందిన టీమిండియా, కొలంబోలో మరో స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించనుంది. గాలే మాదిరిగానే కొలంబోలో కూడా పిచ్ స్పిన్కు అనుకూలించడంతో, 6గురు బ్యాట్స్మెన్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. అయితే, ఈ తుది జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనుంది. కుల్దీప్ యాదవ్ను తప్పించి, ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన 33 ఏళ్ల సారాంశ్ జైన్ ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?
దీంతో కుల్దీప్ యాదవ్ను తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ తరపున అద్భుతంగా రాణించిన సారాంశ్ జైన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్క్వాడ్లోకి వచ్చాడు. ప్రతిభావంతుడైన అతడికి అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. సారాంశ్ జైన్ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను తప్పించక తప్పదు. గాలే టెస్టులో ఈ చైనామాన్ బౌలర్ 25 ఓవర్లలో 103 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో కుల్దీప్ను పక్కన పెట్టడం దాదాపు ఖాయం అనిపిస్తోంది. ఈ మార్పు మినహా జట్టులో మిగతా ప్లేస్లలో ఎటువంటి మార్పులు ఉండవు. ఈ నెల 23 నుంచి ఈ రెండో టెస్టు ప్రారంభం కానుంది.
సారాంశ్ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ రికార్డు బట్టి చూస్తే, 54 మ్యాచ్లలో 188 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్ యావరేజ్ 27.30 కాగా, ఐదు వికెట్ల హాల్స్ 10 ఉన్నాయి. బ్యాటింగ్లో 2223 పరుగులు చేసి, 31.75 బ్యాటింగ్ యావరేజ్ను నమోదు చేశాడు. రికార్డుల పరంగా బాగున్నప్పటికీ, అతడి వయసు 33 ఏళ్లు. ఇక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ తొలి టెస్టులో రాణించకపోయినా, అతడు రెండో టెస్టులో మెరుస్తాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
దీంతో కేఎల్ రాహుల్తో కలిసి యశస్వి జైస్వాల్ మరోసారి ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఫస్ట్ డౌన్లో దేవదత్ పడిక్కల్, ఆ తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్లో ఉంటారు. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, ధ్రువ్ జూరల్ బ్యాటింగ్కు రానున్నారు. ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్లు ప్లేయింగ్ 11లో ఉంటారు. అలాగే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలతో మొత్తంగా ఈ తుది జట్టుతోనే టీమిండియా రెండో టెస్టులో బరిలోకి దిగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




