AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. మరి రాహుల్ ద్రవిడ్ ఏం చేస్తాడంటే?

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా కోచ్‌గా మారే ఛాన్స్ ఉంది. నివేదికల ప్రకారం, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్..

Team India: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. మరి రాహుల్ ద్రవిడ్ ఏం చేస్తాడంటే?
Vvs Laxman
Venkata Chari
|

Updated on: May 18, 2022 | 3:55 PM

Share

ఐపీఎల్ 2022(IPL 2022) తర్వాత భారత్-దక్షిణాఫ్రికా(Ind vs Sa) టీంల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. నివేదికల ప్రకారం, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. IPL 2022లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లు టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని బలంగా నమ్ముతున్నారు. విరాట్, రోహిత్, బుమ్రా వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా కోచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీవీఎస్‌ లక్ష్మణ్‌(VVS Laxman) నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ అధినేతగా ఉన్నారు. టీమ్‌ ఇండియా ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉంది. సీనియర్ జట్టుతో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అక్కడికి వెళ్లనున్నారు.

Also Read: IPL 2022: బుమ్రా ఖాతాలో స్పెషల్ రికార్డ్.. ఆ లిస్టులో చేరిన తొలి పేస్ బౌలర్‌..

ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, సౌతాఫ్రికా సిరీస్‌లో ప్రధాన కోచ్ పాత్రలో VVS లక్ష్మణ్ కనిపించనున్నట్లు బీసీసీఐ అధికారి తెలియజేశారు. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, ‘టీమ్ ఇండియా ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌లో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 24 నుంచి బర్మింగ్‌హామ్‌లో చివరి టెస్టు జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ద్రవిడ్, టీమిండియా జూన్ 15 లేదా 16న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ల టీ20 సిరీస్‌లకు జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండాలని వీవీఎస్ లక్ష్మణ్‌ను కోరినట్లు తెలుస్తోంది.

2021లో కూడా రెండు జట్లతో బరిలోకి దిగిన టీమిండియా..

ఇవి కూడా చదవండి

గత ఏడాది టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు, ఆ సమయంలో భారత B జట్టు శ్రీలంకతో ODI, T20 సిరీస్‌లు ఆడేందుకు వెళ్లింది. ఆ సమయంలో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అయితే శ్రీలంక పర్యటనకు రాహుల్ ద్రవిడ్ కోచ్ పాత్రలో వచ్చాడు. ఈసారి కూడా అలాంటిదే జరగొచ్చని తెలుస్తోంది.

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్..

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. దీని తర్వాత రెండో టీ20-జూన్ 12న కటక్‌లో, మూడో టీ20 జూన్ 14న విశాఖపట్నంలో జరగనుంది. చివరి రెండు మ్యాచ్‌లు జూన్ 17న రాజ్‌కోట్‌లో, జూన్ 19న బెంగళూరులో మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్‌కి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు- టెంబా బావుమా, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నార్కియా, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, ట్వేన్ ప్రిటోరియస్, కగిబ్రా రైస్ట్‌బాసి, స్ట్రస్ట్ , రాసి వాన్ డర్ డుసన్, మార్కో యాన్సన్.

Also Read: IPL 2022: చరిత్ర సృష్టించిన రూ. 9 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌లో రెండో భారతీయుడిగా రికార్డ్..

Team India: టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ.. లిస్టులో ఐదుగురు.. రూ. 8.50 కోట్ల ప్లేయర్‌కు ఈసారైన ఛాన్స్ దక్కేనా?