AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ‘ఎంసీజీ నా సొంత మైదానం లాంటిది.. నన్ను ఎదుర్కొవడం టీమిండియాకు అంత సులభం కాదు’

ప్రపంచ కప్ 2022 మ్యాచ్ భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 23 న జరగనుంది. ఇది ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ MCG గ్రౌండ్‌లో జరగనుంది.

IND vs PAK: 'ఎంసీజీ నా సొంత మైదానం లాంటిది.. నన్ను ఎదుర్కొవడం టీమిండియాకు అంత సులభం కాదు'
India Vs Pakistan 2022
Venkata Chari
|

Updated on: Sep 30, 2022 | 6:55 AM

Share

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు తమ తొలి మ్యాచ్‌లో మరోసారి తలపడనున్నాయి. గతేడాది ఇరు జట్లు తలపడగా అందులో పాక్ గెలిచింది. ఈసారి ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో ఉంది. ఈ రెండు జట్లు ప్రపంచ ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అంటే MCGలో ఢీకొంటాయి. మ్యాచ్‌కి ఇంకా సమయం ఉంది. కానీ, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ అప్పుడే దాయాదిల పోరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ కీలక ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ గురువారం మాట్లాడుతూ.. భారత్‌తో జరిగే మ్యాచ్‌కు తాను సన్నాహాలు ప్రారంభించానని, తనను ఎదుర్కొవడం టీమిండియాకు అంత సులభం కాదని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ గురించి రౌఫ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరగడం పట్ల అతను మరింత సంతోషంగా ఉన్నాడు.

నిజానికి మెల్‌బోర్నే తనకు సొంత మైదానం లాంటిదని రౌఫ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌లో రవూఫ్ భాగమయ్యాడు. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మంచి ప్రదర్శన అతనికి పాకిస్థానీ జట్టులో కూడా చోటు కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీని గురించి రవూఫ్ మాట్లాడుతూ, “నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే, నన్ను ఎదుర్కోవడం వారికి అంత సులభం కాదు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది మాత్రమే కాదు.. ఈ మ్యాచ్ కోసం తాను ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించానని, టీమిండియాపై బౌలింగ్ వ్యూహాన్ని రచిస్తున్నానని రౌఫ్ చెప్పుకొచ్చాడు. నేను మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఆడుతున్నాను. కాబట్టి ఇది నా హోమ్ గ్రౌండ్ అని పాక్ పేసర్ చెప్పుకొచ్చాడు. అక్కడ ఎలా ఆడాలో నాకు తెలుసు. భారత్‌పై ఎలా బౌలింగ్ చేయాలో కూడా వ్యూహరచన ప్రారంభించాను.

గత 10 నెలల్లో భారతదేశం వర్సెస్ పాకిస్థాన్‌లు మూడుసార్లు ఢీకొన్నాయి. రవూఫ్ ఈ మూడింటిలో భాగమయ్యాడు. ఇండో-పాక్ మ్యాచ్‌పై రవూఫ్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లలో చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రపంచకప్‌లో నేను ఆ ఒత్తిడిని అనుభవించాను. కానీ, ఆసియా కప్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో నేను ఆ ఒత్తిడిని అనుభవించలేదు. ఎందుకంటే నేను నా వంతు కృషి చేయాలని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.

ఏడాది వ్యవధిలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఇది నాలుగో ఘర్షణ. యూఏఈలో జరిగిన టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చివరిసారిగా పది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇది ప్రపంచ కప్‌లో భారత్‌పై వారి మొదటి విజయం. దీని తర్వాత, ఆసియా కప్‌లో గ్రూప్ దశలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అతనిని ఓడించింది. అయితే సూపర్ ఫోర్ రౌండ్‌లో ఓడిపోయింది.