Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..

ఇండియా పాక్ మ్యాచ్ అంటే.. స్టేడియంలో పోరాటమే కాదు.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్ మధ్య కూడా హైవోల్టేజ్ ఉంటుంది. బౌండరీ కొడితే కేరింతలు..

Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..
Ind Vs Pak
Follow us

|

Updated on: Oct 24, 2021 | 11:09 AM

ఇండియా- పాక్ మ్యాచ్ అంటే.. స్టేడియంలో పోరాటమే కాదు.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్ మధ్య కూడా హైవోల్టేజ్ ఉంటుంది. బౌండరీ కొడితే కేరింతలు.. వికెట్ తీస్తే కేకలు వేయడం అన్ని మ్యాచ్‌ల్లో మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఇండియా పాక్ మ్యాచ్ అంటే.. అంతకు మించి.. ఫ్యాన్స్ రెచ్చిపోతారు. స్టాండ్స్‌లో ఎప్పుడూ చూడని సీన్లు తళుక్కుమంటాయి. పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్ ఎక్కడ ఆడినా ఆ ఇద్దరూ కనిపిస్తుంటారు. పెద్ద పెద్ద జెండాలను మూడు రంగులతో ఒకరు.. ఇదే తరహాలో పాకిస్తాన్ ఫ్యాన్ మరొకరు. వీరిద్దరిలో ఒకరిది ఇండియా.. మరొకరిది పాకిస్తాన్. వీళ్లకి నరనరంలో దేశం మీద అమితమైన భక్తి .. అంతే కాదు ఆట మీద పట్టుంది. టీమ్‌ల గెలుపు కోసం అభిమానులు చేసే కోలాహం ఓ రేంజ్‌లో ఉంటుంది.

టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ.. శంఖం పూరించాడు టీమిండియా అభిమాని. ప్రత్యర్థి గుండెలు అదిరేలా.. దుబాయ్ గడ్డ మీద టీమిండియా విజయగర్వంతో ఇక్కడితోనే మొదలయ్యింది.  భారతదేశం- పాకిస్తాన్‌ తరఫున ఈ ఇద్దరు సూపర్ అభిమానులు దుబాయ్‌లో కలిసినప్పుడు సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.ఇప్ప్పుడు భారత్ – పాక్ సందర్భంగా వీళ్లిద్దరి మద్ది ఫన్నీ కన్వర్షేషన్ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ సారి కూడా మాదే గెలుపని ఇండియా అభిమాని అంటుంటే.. లేదు ఈ ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ పాక్ అభిమాని అడుగుతున్నాడు. ఒక్కసారి మీరూ చూడండి.

నిజానికి ప్రపంచకప్ లాంటి పెద్ద వేదికపై భారత్ చేతిలో పదే పదే ఓడిపోవడం వల్ల పాకిస్తాన్‌లో చాలా టీవీలు పగిలిపోయాయి. ఇప్పుడు టీవీని బద్దలు కొట్టడం గురించి మాట్లాడటం పెద్ద జోక్ అనిపిస్తుంది. సరే, ఈరోజు జరగనున్న భారత్-పాక్ పోరు కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు దుబాయ్ చేరుకుంటున్నారు. ఇవాళ్టి భీకర పోరు కోసం, పాకిస్తాన్‌కు చెందిన బషీర్ కూడా చికాగో నుండి దుబాయ్ చేరుకోగా..  భారత్‌కు చెందిన టీమిండియా వీరాభిమాని సుధీర్ గౌతమ్ కూడా దుబాయ్‌కి వెళ్లారు.

పాకిస్తాన్‌లో మామ టీవీ బ్రేక్‌ అవుతుందని సుధీర్‌ గౌతమ్‌ అన్నారు. దీనిపై బషీర్ మామ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రతిసారి టీవీని ఎందుకు పగలగొట్టుకుంటుంది. ఈసారి భారతదేశంలో టీవీ పగులుతాయి అంటూ కామెంట్ చేశాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లలో తరచుగా కలిసి కనిపించే ఈ ఇద్దరు సూపర్ క్రికెట్ అభిమానుల మధ్య ఇలాంటి మధురమైన గొడవ జరిగింది. ఇది సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

మామయ్య ధోనీని చూసేందుకు దుబాయ్ చేరుకున్నాడు

ఇదిలావుంటే పాకిస్తాన్ అభిమాని బషీర్ మాత్రం మన ధోనీకి వీరాభిమాని. ఈ వీడియోలో ఆయన మరోసారి రుజువు ఇచ్చారు. వారు ధోనీ ఐ లవ్ యు అంటూ నినాదాలు చేశారు. గత ఏడాది ధోనీ రిటైర్డ్ అయినప్పుడు బషీర్ మామ ICC ఈవెంట్‌లలో ఇండో-పాక్ మ్యాచ్‌లను చూడకూడదని ప్రమాణం చేశారు. అటువంటి పరిస్థితిలో తాను దుబాయ్ చేరుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ధోని కోసమే తాను ఇక్కడికి వచ్చానని Insidesport.in కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ధోనీ జట్టుతో ఉన్నాడని అందుకే ఈ మ్యాచ్‌ను చూస్తానని తెలిపాడు.

ఇవి కూడా చదవండి: IND vs PAK, T20 World Cup 2021: యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గేదెలే.. భారత్ వర్సెస్ పాక్ హెడ్‌ టూ హెడ్ రికార్డులు..!

Aadhaar card: ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలని అనుకుంటున్నారా.. ఇలా చేయండి.. చాలా ఈజీ..