IND vs PAK: నరేంద్ర మోడీ స్టేడియంను పేల్చేస్తామంటూ బెదిరింపు.. కట్చేస్తే.. షాకిచ్చిన పోలీసులు..
Narendra Modi Stadium, World Cup 2023: అక్టోబర్ 14 న అహ్మదాబాద్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది. ఇందులో సుమారు లక్ష మంది ప్రేక్షకులు హాజరవుతారు. మ్యాచ్ను చూసేందుకు దేశంలోని చాలా మంది పెద్ద వ్యక్తులు కూడా స్టేడియంలో హాజరుకానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్కు అహ్మదాబాద్లో భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేశారు.

IND vs PAK: ప్రపంచ కప్ 2023 ఇప్పుడు పూర్తి స్వింగ్లో సాగుతోంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్లు తలపడే మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. అక్టోబర్ 14న దాయాదుల పోరు జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్లో ఈ గొప్ప మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగానే ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్సుకత నెలకొని ఉంది. ఈసారి కూడా ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరగడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ఈ మ్యాచ్కు అభిమానులే కాదు, పలువురు ప్రముఖులు కూడా స్టేడియంలో హాజరుకానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మ్యాచ్కు భద్రత, కట్టుదిట్టం చేయడం సహజం. అయితే, ఈ క్రమంలో స్టేడియంను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన ఓ వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో ఇలాంటి బెదిరింపులు, వికృత చేష్టల భయం ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లు లేదా సిరీస్ల సమయంలో బెదిరింపు ఇమెయిల్లు లేదా లేఖలు తరచుగా వస్తుంటాయి. ఇటువంటి పరిస్థితిలో, భద్రతా సంస్థలు దీని గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. ఎలాంటి సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.
బీసీసీఐకి బెదిరింపు ఈమెయిల్..
వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ గుజరాత్లోని రాజ్కోట్లో హిస్టరీ-షీటర్ను అరెస్టు చేసింది. సమాచారం ప్రకారం, ఈ వ్యక్తి కొద్ది రోజుల క్రితం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఒక ఇమెయిల్ పంపాడు. అందులో అక్టోబర్ 14 న జరగనున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా నరేంద్ర మోడీ స్టేడియంను పేలుస్తానని బెదిరించాడు. అరెస్టయిన నిందితుడి పేరు కరణ్ మావి. కాగా అతడు మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందినవాడు.
క్రైమ్ బ్రాంచ్ ప్రకారం, మావిపై ఐపీసీ సెక్షన్ 505 (1) బి, 506 (2) కింద కేసులు నమోదు చేశారు. మావి ఇప్పటికే మధ్యప్రదేశ్లో అత్యాచారం, మానవ అక్రమ రవాణా వంటి కేసుల్లో దోషిగా తేలాడు.
ఖలిస్తాన్ కూడా బెదిరింపులు..
ఈ ఇమెయిల్ మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ కూడా ప్రపంచ కప్ సందర్భంగా బెదిరించింది. కెనడాలో ఉన్న సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు క్రికెట్ ప్రపంచ కప్ను ఉగ్రవాద ప్రపంచ కప్గా మారుస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








