AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: భారత పర్యటనకు సిద్ధమైన ఇంగ్లండ్ జట్టు.. అబుదాబిలో ప్రాక్టీస్ షురూ..

India vs England Test Series: ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా 2021లో భారత్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బౌలింగ్‌కు ఇంగ్లండ్‌ జట్టు ఆటగాళ్ల వద్ద సమాధానం లేదు. జో రూట్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్‌లో తొలి టెస్టులో విజయం సాధించినా.. ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఆ టెస్టు సిరీస్‌ని 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది.

IND vs ENG: భారత పర్యటనకు సిద్ధమైన ఇంగ్లండ్ జట్టు.. అబుదాబిలో ప్రాక్టీస్ షురూ..
Ind Vs Eng Test Series
Venkata Chari
|

Updated on: Jan 16, 2024 | 7:06 PM

Share

England Cricket Team: ప్రస్తుతం, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు(Team India) ఆఫ్ఘనిస్తాన్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో ఆతిథ్య జట్టు అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. దీని తర్వాత, ఇంగ్లండ్ జట్టు ఈ నెలలో భారత్‌ను (IND vs ENG) సందర్శించనుంది. రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటన కోసం తన సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు ఇంగ్లాండ్ బోర్డు ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పర్యటన ప్రారంభానికి ముందు అబుదాబిలో ఇంగ్లాండ్ తన శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వెలువడిన ఫొటోలలో జో రూట్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇంగ్లీష్ ఆటగాడు నెట్స్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలపై పని చేస్తున్నాడు.

ఇంగ్లండ్ ఆటగాళ్ల ఫొటోలను ఇక్కడ చూడొచ్చు..

మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బోర్డ్ కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ‘ఎవరో సరైన కెమెరాలో పెట్టుబడి పెట్టారు’ అంటూ రాసుకొచ్చాడు.

భారత్‌లో చివరి టెస్టు సిరీస్‌ను 3-1తో కోల్పోయిన ఇంగ్లండ్..

ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా 2021లో భారత్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బౌలింగ్‌కు ఇంగ్లండ్‌ జట్టు ఆటగాళ్ల వద్ద సమాధానం లేదు. జో రూట్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్‌లో తొలి టెస్టులో విజయం సాధించినా.. ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఆ టెస్టు సిరీస్‌ని 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల కోసం భారత జట్టు తన జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు స్పిన్ బౌలర్లను ఎంపిక చేశారు. బెన్ స్టోక్స్ సారథ్యంలోని జట్టులో నలుగురు స్పిన్నర్లకు కూడా అవకాశం లభించగా, వారిలో ఇద్దరు ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..