AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: 303 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. సెంచరీతో ఆకట్టుకున్న జోరూట్.. 5 వికెట్లతో బుమ్రా దూకుడు..

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా విజయం సాధించాలంటే 209 పరుగులు చేయాల్సి ఉంది.

IND vs ENG: 303 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. సెంచరీతో ఆకట్టుకున్న జోరూట్.. 5 వికెట్లతో బుమ్రా దూకుడు..
Ind Vs Eng
Venkata Chari
|

Updated on: Aug 07, 2021 | 10:42 PM

Share

IND vs ENG: నాటింగ్‌హామ్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. షమి వేసిన 85.5 ఓవర్‌కు రాబిన్‌సన్‌(15) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్‌ తీశాడు. జో రూట్‌ (109) శతకంతో చెలరేగాడు. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ 5, అండర్సన్‌ 4 వికెట్లు పడగొట్టారు.

Also Read: Neeraj Chopra: ఒకప్పుడు ఊబకాయుడు.. ఇప్పుడు వండర్ క్రియేట్ చేసిన వీరుడు.. జయహో నీరజ్

Neeraj Chopra: దేశం నిన్ను చూసి గర్విస్తోంది.. నీరజ్ అద్భుత విజయంపై ప్రముఖులు ఎలా స్పందించారంటే.