AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం..

IND Vs ENG: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు
Team India
Ravi Kiran
|

Updated on: Jun 26, 2024 | 8:59 AM

Share

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందుగా టీమిండియా జట్టులో కీలక మార్పులు ఉండొచ్చునన్న వార్తలు వస్తున్నాయి.

టోర్నీలో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా అంచనాలు అందుకోలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని టీమిండియా.. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుంది. 2022లో ఇదే టీమ్‌తో తలబడిన టీమిండియా.. ఆ టోర్నీలో ఘోర ఓటమిపాలైంది. దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని కసితో ఉంది రోహిత్ సేన. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఓపెనింగ్‌లో కోహ్లీ పూర్తిగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మొన్న ఆసీస్‌పై కూడా విరాట్ డకౌట్ అయ్యాడు. టోర్నీ ఇది అతడికి రెండో డక్. ఇప్పటివరకు కోహ్లీ కేవలం 11 యావరేజ్‌తో కేవలం 66 పరుగులే చేశాడు. కాబట్టి కోహ్లీని ఎప్పటిలానే మూడో స్థానంలో దింపి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపనున్నారట. ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముందట. ఈ ఒక్క మార్పు మినహా.. మిగతా టీం.. సేమ్ టూ సేమ్ కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా జట్టు(అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే/యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇది చదవండి: సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..