AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం..

IND Vs ENG: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు
Team India
Ravi Kiran
|

Updated on: Jun 26, 2024 | 8:59 AM

Share

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందుగా టీమిండియా జట్టులో కీలక మార్పులు ఉండొచ్చునన్న వార్తలు వస్తున్నాయి.

టోర్నీలో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా అంచనాలు అందుకోలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని టీమిండియా.. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుంది. 2022లో ఇదే టీమ్‌తో తలబడిన టీమిండియా.. ఆ టోర్నీలో ఘోర ఓటమిపాలైంది. దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని కసితో ఉంది రోహిత్ సేన. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఓపెనింగ్‌లో కోహ్లీ పూర్తిగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మొన్న ఆసీస్‌పై కూడా విరాట్ డకౌట్ అయ్యాడు. టోర్నీ ఇది అతడికి రెండో డక్. ఇప్పటివరకు కోహ్లీ కేవలం 11 యావరేజ్‌తో కేవలం 66 పరుగులే చేశాడు. కాబట్టి కోహ్లీని ఎప్పటిలానే మూడో స్థానంలో దింపి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపనున్నారట. ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముందట. ఈ ఒక్క మార్పు మినహా.. మిగతా టీం.. సేమ్ టూ సేమ్ కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా జట్టు(అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే/యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇది చదవండి: సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎండు మిరపకాయలతో టమాటో పచ్చడి.. మీరు ఎప్పుడైనా చేశారా..?
ఎండు మిరపకాయలతో టమాటో పచ్చడి.. మీరు ఎప్పుడైనా చేశారా..?
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి