AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?

Team India May Enter Final Without Playing T20 World Cup Semi-Final: ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్‌లు ముగిశాయి. సెమీ-ఫైనల్‌కు చేరుకున్న 4 జట్ల పేర్లు వెల్లడయ్యాయి. గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్ఘానిస్తాన్ చోటు దక్కించుకున్నాయి. ఆప్ఘాన్ విజయంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు గ్రూప్‌ 2 నుంచి చోటు దక్కించుకున్నాయి.

Team India: సెమీస్ ఆడకుండానే ఫైనల్‌కు వెళ్లనున్న టీమిండియా.. ఎందుకో తెలుసా?
Team India
Venkata Chari
|

Updated on: Jun 25, 2024 | 12:44 PM

Share

Team India May Enter Final Without Playing T20 World Cup Semi-Final: ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్‌లు ముగిశాయి. సెమీ-ఫైనల్‌కు చేరుకున్న 4 జట్ల పేర్లు వెల్లడయ్యాయి. గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్ఘానిస్తాన్ చోటు దక్కించుకున్నాయి. ఆప్ఘాన్ విజయంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు గ్రూప్‌ 2 నుంచి చోటు దక్కించుకున్నాయి. జూన్ 27న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో ఆడనుంది.

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. అయితే, కొన్ని కారణాల వల్ల మ్యాచ్ జరగకపోయినా లేదా రద్దు చేసినా భారత అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేక నిబంధనల కారణంగా టీమిండియా సులువుగా ఫైనల్ చేరుతుంది.

రెండో సెమీ-ఫైనల్‌లో రిజర్వ్ డే నిబంధనలు?

గయానాలో వర్షం పడే సూచన ఉంది. వాతావరణం చెడుగా ఉంటే రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా రద్దు చేయవచ్చు. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ఐసీసీ మొదటి సెమీ-ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డేని ఉంచింది. కానీ, రెండవ సెమీ-ఫైనల్‌కు కేవలం 4 గంటల 10 నిమిషాలు అంటే దాదాపు 250 నిమిషాల అదనపు సమయం ఇచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ వ్యవధిలో మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ రద్దు అవుతుంది. దీంతో టీమిండియా ప్రయోజనం పొందుతుంది.

ఇంగ్లండ్‌తో పోలిస్తే భారత్‌కు ఎందుకు ప్రయోజనం?

వాస్తవానికి, భారత్ తన సూపర్ 8 రౌండ్ మ్యాచ్‌లలో 3 గెలిచి, 6 పాయింట్లతో గ్రూప్ 1లో మొదటి స్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. అదే సమయంలో ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీకి సంబంధించి ఐసీసీ రూపొందించిన నిబంధనల మేరకు మ్యాచ్ జరగకపోతే సూపర్ 8లో ఏ జట్టు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉంటే ఆ జట్టు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా, మ్యాచ్ జరగకపోతే, భారత్ మొదటి స్థానంలో ఉండటంతో రోహిత్ సేన ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు