Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: 7 వికెట్లు.. 536 పరుగులు.. పీక్స్‌కు చేరిన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్.. 58 ఏళ్ల హిస్టరీ మార్చనున్న గిల్ సేన..?

England vs India, 2nd Test: భారత జట్టు 6 వికెట్లకు 427 పరుగులు చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. శుభ్‌మాన్ గిల్ సెంచరీ చేయగా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

IND vs ENG: 7 వికెట్లు.. 536 పరుగులు.. పీక్స్‌కు చేరిన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్.. 58 ఏళ్ల హిస్టరీ మార్చనున్న గిల్ సేన..?
Ind Vs Eng 2nd Test
Venkata Chari
|

Updated on: Jul 06, 2025 | 7:17 AM

Share

IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌ ఉత్కంఠగా సాగుతోంది. తొలి రోజు నుంచి భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. మూడో రోజు కొద్దిసేపు ఇంగ్లండ్ ఆధిపత్యం సాధించినా, తిరిగి భారత్ లెక్కలోకి తిరిగి వచ్చింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి, ఆతిథ్య జట్టు 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలీ 0, బెన్ డకెట్ 25, జో రూట్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత్ తరపున 2 వికెట్లు, సిరాజ్ 1 వికెట్ పరడగొట్టారు. ఇక ఐదో రోజు ఇంగ్లండ్ జట్టు 536 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ టెస్ట్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వరుసగా రెండో సెంచరీతో భారత్ ఆరు వికెట్లకు 427 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మాన్ 161 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను గెలుచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు భారత్ ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు.

ఈ టెస్ట్‌లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఇంగ్లాండ్ జట్టు ప్రారంభం మళ్ళీ దారుణంగా మారింది. ఓపెనర్ జాక్ క్రౌలీ ఏడు బంతుల్లోనే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ అతన్ని తన బాధితుడిగా మార్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సున్నా వద్ద ఔటైన బెన్ డకెట్ ఈసారి ఐదు ఫోర్లతో దూకుడుగా కనిపించాడు. 25 పరుగులు చేసి ఆకాష్ దీప్ అద్భుతమైన బంతితో పెవిలియన్ చేరాడు. జో రూట్ బ్యాట్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా పని చేయలేదు. ఆరు పరుగులు చేసిన తర్వాత ఆకాష్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

భారత్ పరుగుల వర్షం..

అంతకుముందు, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. రాహుల్ 55, పంత్ 65, జడేజా అజేయంగా 69 పరుగులు చేశారు. శుభ్‌మన్‌కు వారందరి నుంచి మంచి మద్దతు లభించింది. దీంతో భారత్ 400 మార్కును దాటింది. చివరకు 607 ఆధిక్యాన్ని అందుకుంది. శుభ్‌మన్ రికార్డు స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. అతను తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో, అతను సెంచరీ వరకు హాయిగా బ్యాటింగ్ చేశాడు. కానీ, ఆ తర్వాత అతను ఇష్టానుసారంగా పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఒక టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన తర్వాత సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా అతను నిలిచాడు. ఈ టెస్ట్‌లో అతను మొత్తం 430 పరుగులు చేశాడు. ఇది ఏ బ్యాట్స్‌మన్ చేసిన రెండవ అత్యధికంగా నిలిచింది.

మళ్ళీ హాఫ్ సెంచరీ బాదిన జడేజా..

జడేజా చాలా నెమ్మదిగా ఆడాడు. కానీ, వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. పంత్ తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ జట్టు నుంచి జోష్ టంగ్, షోయబ్ బషీర్ తలా 2 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..