AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: చెపాక్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఏ జట్టుదో తెలుసా? లిస్ట్ చూస్తే బంగ్లా షేక్ అవ్వాల్సిందే

India vs Bangladesh: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇది ఇప్పుడు చెపాక్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌కు నిర్దేశించిన అత్యధిక లక్ష్యంగా మారింది. ఇది 2021లో భారత్‌పై ఇంగ్లండ్ నెలకొల్పిన 482 పరుగుల గత రికార్డును అధిగమించింది.

IND vs BAN: చెపాక్‌లో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఏ జట్టుదో తెలుసా? లిస్ట్ చూస్తే బంగ్లా షేక్ అవ్వాల్సిందే
Ind Vs Ban 1st Test
Venkata Chari
|

Updated on: Sep 21, 2024 | 2:18 PM

Share

India vs Bangladesh 1st Test, Day 3: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. చెన్నై టెస్టులో మూడో రోజైన శనివారం భారత్ 287/4 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం సాధించింది.

ప్రస్తుతం వార్తలు రాసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్ క్రీజులో ఉన్నారు.

భారత్ తరపున రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అజేయంగా 119, రిషబ్ పంత్ 109 పరుగులు చేశారు. వీరిద్దరూ కాకుండా కేఎల్ రాహుల్ 22 నాటౌట్, విరాట్ కోహ్లీ 17, యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 5 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ తరపున మెహదీ హసన్‌ మిరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇది ఇప్పుడు చెపాక్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌కు నిర్దేశించిన అత్యధిక లక్ష్యంగా మారింది. ఇది 2021లో భారత్‌పై ఇంగ్లండ్ నెలకొల్పిన 482 పరుగుల మునుపటి రికార్డును అధిగమించింది.  ఈ వేదికపై అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్ 2008లో జరిగింది. ఇంగ్లండ్‌పై 387 పరుగులను ఛేదించిన భారత్‌ చిరస్మరణీయ విజయంతో సత్తా చాటింది.

చెపాక్‌లో అత్యధిక టార్గెట్ ఛేజింగ్ జాబితా ఇదే..

1) భారత్ – 515 vs బంగ్లాదేశ్, 2024 – ఫలితం కోసం వేచి ఉంది

2) భారత్ – 482 vs ఇంగ్లాండ్, 2021 – భారత్ గెలిచింది

3) ఇంగ్లాండ్ – 452 vs భారత్, 1934 – ఇంగ్లాండ్ గెలిచింది

4) ఇంగ్లాండ్ – 420 vs భారత్, 2021 – ఇంగ్లాండ్ గెలిచింది

5) భారత్ – 416 vs వెస్టిండీస్, 1989 – భారత్ గెలిచింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..