IND vs BAN: కోహ్లీనే కాదు అతని బ్యాట్‌తోనూ ప్రమాదమే.. ఆకాశ్ దీప్ భారీ సిక్సర్ల వెనక అసలు కహానీ

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు వృథా అయింది. అయితే నాలుగో రోజు మాత్రం మ్యాచ్ నాటకీయ మలుపులు తిరిగింది. తొలి రోజు బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందనిపించింది

IND vs BAN: కోహ్లీనే కాదు అతని బ్యాట్‌తోనూ ప్రమాదమే.. ఆకాశ్ దీప్ భారీ సిక్సర్ల వెనక అసలు కహానీ
Akash Deep
Follow us

|

Updated on: Oct 01, 2024 | 10:11 AM

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు వృథా అయింది. అయితే నాలుగో రోజు మాత్రం మ్యాచ్ నాటకీయ మలుపులు తిరిగింది. తొలి రోజు బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందనిపించింది. అయితే నాలుగో రోజు లంచ్ విరామానికే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ జట్టు మొత్తం 233 పరుగులకే ఆలౌటైంది. భారత్ గెలవాలంటే ఈ పరుగులను ఛేజ్ చేసి ఆధిక్యం సాధించడం తప్పనిసరి. ఈ క్రమంలోనే భారత్ దూకుడుగా ఆడడం ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం ఇచ్చారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి జోడీ రాణించడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. భారత్ ఇంకా 26 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదడం పెద్ద చర్చనీయాంశమైంది. పిచ్‌పైకి అడుగుపెట్టిన వెంటనే ఆకాశ్ దీప్ 3 బంతుల్లో 2 సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్లకు విరాట్ కోహ్లీకి ప్రత్యేక అనుబంధం ఉంది.

ఇవి కూడా చదవండి

అదేంటంటే.. తాజాగా విరాట్ కోహ్లీ ఆకాశ్ దీప్ కు విరాట్ కోహ్లీ బ్యాట్ ను బహుమతిగా ఇచ్చాడు. కాన్పూర్ టెస్టులో విరాట్ బ్యాట్‌తో ఆకాశ్ దీప్‌కు బహుమతి లభించడంతో ఆటగాడు అద్భుతంగా చేశాడు. షకీబ్ అల్ హసన్ వేసిన రెండు బంతుల్లో ఆకాశ్ దీప్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆకాశ్‌దీప్‌ సిక్సర్లు చూసి విరాట్‌ కోహ్లి ఆనందం పట్టలేకపోయాడు. పెవిలియన్‌లో ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ కనిపించాడు. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఈ రెండు షాట్‌లను చూస్తూ మురిసిపోయారు.

 వీడియో ఇదిగో..

కాన్పూర్ టెస్ట్‌లో మూడు రోజుల ఆట వర్షం కారణంగా ప్రభావితమైంది. అయితే నాల్గవ రోజు, భారత జట్టు బౌలర్లు మొదట బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే పరిమితం చేశారు, ఆపై టీ 20 క్రికెట్ తరహాలో టీమిండియా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన మొదటి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ వ్యూహాన్ని నిర్ణయించాడు, యశస్వి జైస్వాల్ దానిని ముందుకు తీసుకెళ్లాడు. రోహిత్ 23 బంతుల్లో 23 పరుగులు చేయగా, జైస్వాల్ 51 బంతుల్లో 72 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ 39 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 47 పరుగులు, రాహుల్ 68 పరుగులు చేశారు. ఈ బ్యాట్స్‌మెన్‌లందరి స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..