IND vs BAN: విధ్వంసం మాములుగా లేదుగా.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో 4 రికార్డులు కొల్లగొట్టిన టీమిండియా

కాన్పూర్ టెస్టు నాలుగో రోజు టీమిండియా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో మిండియా కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.  ఈ క్రమంలోనే రికార్డులు కూడా క్యూ కట్టాయి

IND vs BAN: విధ్వంసం మాములుగా లేదుగా.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో 4 రికార్డులు కొల్లగొట్టిన టీమిండియా
Team India
Follow us

|

Updated on: Oct 01, 2024 | 11:00 AM

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. వర్షం కారణంగా రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. అయితే భారత జట్టు నాలుగో రోజు దాన్ని భర్తీ చేసింది. అంతేకాదు టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కాన్పూర్ టెస్టు నాలుగో రోజు టీమిండియా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో మిండియా కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.  ఈ క్రమంలోనే రికార్డులు కూడా క్యూ కట్టాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3 ఓవర్లలో 50 పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు టెస్టుల్లో 10.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన ఘనత అందుకుంద. ఇంతకు ముందు ఈ రికార్డు భారత్‌ పేరిట ఉండేది. టెస్టుల్లో 24.2 ఓవర్లలో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా ఈ రికార్డు లేదు. ఈ టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దూకుడు ప్రదర్శించారు. ఈ జోడీ టెస్టుల్లో 19 బంతుల్లో 50 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈసారి యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో 30 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 6 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఒక పరుగు నో బాల్‌గా వచ్చింది.ఈ మ్యాచ్ లో భారత్ 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఈ పరుగుల సమయంలో ప్రతి ఆటగాడి స్ట్రైక్ రేట్ భారీగా ఉందిఉంది. భారత్ కూడా 8.2 రన్ రేట్‌తో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

టెస్టుల్లో తొలిసారి ఓపెనర్ అంటే రోహిత్ శర్మ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. జైస్వాల్ తొలి ఓవర్‌కు స్ట్రైక్‌లో ఉన్నాడు. ఆరు బంతుల్లో 12 పరుగులు చేశాడు. రెండో ఓవర్‌లో రోహిత్ శర్మకు స్ట్రయిక్ వచ్చింది. ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి రెండు బంతుల్లోనే అద్భుతమైన సిక్స్. 96 సిక్సర్లతో ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. .ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2022లో బేస్ బాల్ వ్యూహంతో ఇంగ్లండ్ 89 సిక్సర్లు కొట్టింది. ఈ ఏడాది భారత్‌కు మరిన్ని టెస్టులు ఆడాల్సి ఉంది. కాబట్టి ఈ సంఖ్య 100 దాటడం ఖాయం.

ఇవి కూడా చదవండి

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (WK), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..