Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency: ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కంగన.. రిలీజ్‌కు మార్గం దొరికనట్టేనా?

1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె ఈ చిత్రానికి డైరెక్టర్ అండ్ కో-ప్రొడ్యూసర్ కూడా. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజుపై వివాదం నడుస్తోంది.

Emergency: 'ఎమర్జెన్సీ' సినిమా కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కంగన.. రిలీజ్‌కు మార్గం దొరికనట్టేనా?
Emergency Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 30, 2024 | 9:03 PM

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రివిజన్ కమిటీ సూచించిన మార్పులు చేసేందుకు నిర్మాణ సంస్థ అంగీకరించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం (సెప్టెంబర్ 30) బాంబే హైకోర్టుకు తెలియజేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను గురువారం (అక్టోబర్ 3)కు వాయిదా వేసింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె ఈ చిత్రానికి డైరెక్టర్ అండ్ కో-ప్రొడ్యూసర్ కూడా. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజుపై వివాదం నడుస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు సినిమాకు కొన్ని కట్స్, మార్పులు సూచించగా ఇప్పుడు కంగనా అందుకు అంగీకరించింది. సిబిఎఫ్‌సి తరపున న్యాయవాది అభినవ్ చంద్రచూడ్, జస్టిస్ బి. పి. ఈ విషయాన్ని కొలబావాలా, ఫిర్దోష్ పూనివాలా ధర్మాసనం ముందు వివరించారు. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాపై సిక్కు సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో సిక్కు సంస్థలను తప్పుగా చిత్రీకరించారని, సమాజ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం తర్వాత ‘ఎమర్జెన్సీ’ నిర్మాతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. సెన్సార్ బోర్డ్‌తో సమావేశమైన కంగనా కొన్ని సన్నివేశాలను కత్తిరించడం, సినిమాలో కొన్ని మార్పులు చేయడం వంటి సూచనలకు అంగీకరించినట్లు ఆమె కోర్టుకు తెలిపింది.

‘ఎమర్జెన్సీ’ సినిమాలో మొత్తం 13 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. కాగా ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ, “నా సినిమాలో నేను ఎలాంటి మార్పులు చేయను. ఎలా తీయాలో అలానే సినిమాను విడుదల చేస్తాను” అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ రావడంలో అడ్డంకులు ఎదురుకావడంతో ఎట్టకేలకు దాన్ని మార్చేందుకు అంగీకరించారు. సినిమాలో మహిళలపై హింస, రాజకీయ హింస, అశాంతిని తెలిపే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ కమిటీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.