AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ND vs AUS: కుంగ్ ఫు పాండ్యా భారీ సిక్సర్.. ఎగిరి గంతేసిన నయా గర్ల్ ఫ్రెండ్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంలో హార్దిక్ పాండ్యా కీలక భూమిక పోషించాడు. అతని 101 మీటర్ల భారీ సిక్సర్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది, దీనికి జాస్మిన్ వాలియా సంబరంగా స్పందించిన వీడియో వైరల్ అయింది. హార్దిక్ ప్రదర్శనతో పాటు కోహ్లీ (84), రాహుల్, అయ్యర్ మద్దతుగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఫైనల్‌లోనూ హార్దిక్ అదరగొడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ND vs AUS: కుంగ్ ఫు పాండ్యా భారీ సిక్సర్.. ఎగిరి గంతేసిన నయా గర్ల్ ఫ్రెండ్
Hardik Pandya Girl Friend
Narsimha
|

Updated on: Mar 06, 2025 | 9:55 AM

Share

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించడంలో హార్దిక్ పాండ్యా కీలక భూమిక పోషించాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్‌కు సులభతరం చేశాడు. అతను కొట్టిన 101 మీటర్ల భారీ సిక్సర్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈ సిక్సర్‌కు అతని ప్రియురాలిగా ప్రచారం జరుగుతున్న బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా సంబరంగా గంతేసిన వీడియో వైరల్‌గా మారింది.

హార్దిక్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చినందుకు జాస్మిన్ వాలియా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు తన స్నేహితులతో కలిసి వచ్చిన ఆమె వీఐపీ లాంజ్‌లో కూర్చొని ఆటను ఆస్వాదించింది. హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాన్కోవిచ్‌తో విడిపోయిన తర్వాత, జాస్మిన్ వాలియాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, జాస్మిన్ వరుసగా భారత జట్టు మ్యాచ్‌లకు హాజరవుతుండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీ (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) తన అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ (3/48), వరుణ్ చక్రవర్తి (2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించారు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ సెంచరీ చేజార్చుకున్నా, శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42), హార్దిక్ పాండ్యా (28) కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కూడా ఆకట్టుకున్నాడు. అతని కీలక వికెట్లు, ఫీల్డింగ్‌లో చూపిన అప్రమత్తత భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. మ్యాచ్ అనంతరం, హార్దిక్ తన ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి మెగా టోర్నమెంట్‌లో నా ప్రదర్శనతో జట్టుకు సహాయపడడం గర్వంగా ఉంది. మా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు,” అని పేర్కొన్నాడు. ఇక ఫైనల్లోనూ హార్దిక్ ఇదే రీతిలో రాణిస్తే, టీమిండియా మరో కీలక టైటిల్‌ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.