AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వెస్టిండీస్‌‌తో వన్డే సిరీస్‌.. హార్దిక్ ఔట్.. రోహిత్, కోహ్లీపై కీలక అప్డేట్..?

వెస్టిండీస్‌ (West Indies)తో త్వరలో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అందుబాటులో ఉండటం లేదు. గాయం పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో బీసీసీఐ (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టులోకి పునరాగమనం చేయనున్నారు.

IND vs WI: వెస్టిండీస్‌‌తో వన్డే సిరీస్‌.. హార్దిక్ ఔట్.. రోహిత్, కోహ్లీపై కీలక అప్డేట్..?
Ind Vs Wi Hardik Pandya
Venkata Chari
|

Updated on: Sep 12, 2026 | 9:35 PM

Share

భారత క్రికెట్ జట్టు (Team India) త్వరలో వెస్టిండీస్ (West Indies) గడ్డపై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ కీలక పోరుకు సంబంధించి బోర్డు సెలెక్షన్ కమిటీ కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. గతంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనూ హార్దిక్ కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ముగిసిన తరువాత ఈ స్టార్ ప్లేయర్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగలేదు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup) గెలిచిన అనంతరం హార్దిక్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.

ఎక్కువమంది చదివినది: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!

ఈ క్రమంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలతో పాటు జింబాబ్వే పర్యటనలకు కూడా ఈ ఆటగాడు ఎంపిక కాలేదు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI CoE) వద్దే ఉంటూ కోలుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాడు. వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 ఐసీసీ వరల్డ్ కప్ (ICC World Cup) టోర్నీని దృష్టిలో ఉంచుకొని ఈ ఆల్ రౌండర్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. అయితే ఆస్ట్రేలియా ‘ఏ’ (Australia A) జట్టుతో సొగగడ్డపై జరిగే వైట్ బాల్ సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా ‘ఏ’ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడంపైనే బరిలోకి దిగడం ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?

మరోవైపు భారత మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే టెస్టులు, పొట్టి క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజాలు కేవలం వన్డేలపైనే దృష్టి పెట్టారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన ముగించుకున్న ఈ ఇద్దరు బ్యాటర్లు ఇప్పుడు విండీస్ సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించనున్నారు. జపాన్ వేదికగా జరిగే 2026 ఏషియన్ గేమ్స్ (Asian Games) టోర్నీకి యువ ఆటగాళ్లు వెళ్లనున్న తరుణంలో సీనియర్ల రాక జట్టుకు బలాన్ని చేకూర్చనుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత వన్డే జట్టులోకి తిరిగి రాబోతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us