Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: వేలంలో 409 మంది ఆటగాళ్లు.. కోట్ల వర్షం కురిసేది మాత్రం ఈ 5గురిపైనే.. లిస్టులో భారత్‌ నుంచే ఇద్దరు..

Women's Premier League: మహిళల ప్రీమియర్ లీగ్‌లో 409 మంది ఆటగాళ్లు వేలం వేయబడతారు. ముంబైలో జరగనున్న వేలంలో ఏ ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు వస్తుందో తెలుసా?

WPL 2023: వేలంలో 409 మంది ఆటగాళ్లు.. కోట్ల వర్షం కురిసేది మాత్రం ఈ 5గురిపైనే.. లిస్టులో భారత్‌ నుంచే ఇద్దరు..
Indw Vs Pakw2
Follow us
Venkata Chari

|

Updated on: Feb 13, 2023 | 9:01 AM

ముంబై వేదికగా జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో 409 మంది ఆటగాళ్ల భవితవ్యం నేడు తేలనుంది. ఈ లీగ్‌లో ఆడేందుకు 1500 మందికి పైగా ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. మహిళల ఐపీఎల్‌ కోసం భారత్‌లో చాలా కాలంగా ఎదురుచూసిన అభిమానులకు.. ఎట్టకేలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించి, డబ్ల్యూపీఎల్‌ను ప్రారంభించింది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఏ క్రీడాకారిణి అత్యధిక మొత్తం అందనుందనేది ఉత్కంఠగా మారింది.

వేలంలో 24 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.50 లక్షలుగా ఉంది. ఇందులో 10 మంది భారత ఆటగాళ్లు, 14 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐదు జట్లు వీరిపై భారీగా పందెం వేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఇందులో 5గురు ఆటగాళ్ల పేర్లు ముందున్నాయి.

స్మృతి మంధాన..

మహిళల ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధానకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఆమెను కొనుగోలు చేయడమే లక్ష్యంగా డబ్ల్యూపీఎల్‌లోని ఐదు జట్లూ భారీగా పోటీపడతాయని భావిస్తున్నారు. దీనికి కారణం ఆమె నిలకడైన ప్రదర్శన, కెప్టెన్సీ లక్షణాలే. అలాగే, ఈ క్రీడాకారిణికి మహిళల బిగ్ బాష్ లీగ్, ఉమెన్స్ హండ్రెడ్‌లో ఆడిన అనుభవం ఉంది. గత సంవత్సరం, మహిళల హండ్రెడ్ లీగ్‌లో ఆమె స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా నిలిచింది. ఇటువంటి పరిస్థితిలో, మంధానపై డబ్బుల వర్షం కురవనుంది. మంధాన బేస్ ధర 50 లక్షల రూపాయలు.

ఇవి కూడా చదవండి

షెఫాలీ వర్మ..

షెఫాలీ వర్మ ఇటీవలే అండర్-19 ప్రపంచ కప్‌ను తన కెప్టెన్సీలో భారతదేశానికి అందించింది. అలాగే ఆమె బ్యాటింగ్‌లోనూ విస్ఫోటనంలా పేలుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఈ క్రీడాకారిణికిపై డబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయడంతో పాటు, ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ వేయడంతో ఈ ప్లేయర్‌ని యుటిలిటీ ప్లేయర్‌గా మార్చనుంది. షెఫాలీ బేస్ ధర కూడా రూ.50 లక్షలు.

అలిస్సా హీలీ..

అలిస్సా హీలీపై కూడా భారీగా పోటీపడేందుకు ఫ్రాంచైజీలు పోటీపడతాయని భావిస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ టీ20 లెజెండ్‌గా పేరుగాంచింది. వేగంగా బ్యాటింగ్ చేసే నైపుణ్యం ముందునుంచే అలవాటుగా మారింది. పొడవాటి సిక్సర్లు కొట్టడంలో హీలీ ఫేమస్. మహిళల టీ20 ప్రపంచ కప్ 2020 ఫైనల్‌లో, హీలీ భారత్‌పై కేవలం 39 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా చేసింది. హీలీ వికెట్ కీపింగ్‌తోపాటు, కెప్టెన్సీతోనూ ఆకట్టుకుంటోంది.

మరిజానే కాప్..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మరిజానే కాప్ కూడా డబ్బు సంపాదించగలదని భావిస్తున్నారు. బాల్, బ్యాట్‌తో మ్యాచ్‌ విన్నర్‌గా మారనుంది. మహిళల టీ20లో 68 వికెట్లతో పాటు 1131 పరుగులు చేసింది. మరిజానే కాప్ రెండుసార్లు మహిళల హండ్రెడ్‌ను గెలుచుకుంది. 2021లో పెర్త్ స్కార్చర్స్‌ను బిగ్ బాష్ ఛాంపియన్‌గా మార్చింది.

అమేలీ కర్‌..

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అమేలీ కర్ మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ ఆధిపత్యం చెలాయించగలదు. ఇంగ్లండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ లెగ్ స్పిన్నర్ కూడా. 55 వికెట్లతో పాటు 565 పరుగులు కూడా చేసింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు ఈమెపై భారీగా పోటీ పడవచ్చని తెలుస్తోంది.#

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..