AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England vs India 3rd ODI: చితక్కొట్టేశారయ్యో.. ఇంగ్లాండోళ్ల దెబ్బకు బద్దలైన 51 ఏళ్ల రికార్డ్

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ సృష్టించిన ఈ పరుగుల విధ్వంసం భారత శిబిరాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. బౌలర్లు విఫలమైన ఈ తరుణంలో, 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు భారత బ్యాటింగ్ వైభవంపైనే ఉంది. మరి మన బ్యాటర్లు ఈ చారిత్రాత్మక మైదానంలో అద్భుతం చేసి భారత్‌కు విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి!

England vs India 3rd ODI: చితక్కొట్టేశారయ్యో.. ఇంగ్లాండోళ్ల దెబ్బకు బద్దలైన 51 ఏళ్ల రికార్డ్
Jacob Bethell And Ben Duckett Opening Partnership
Venkata Chari
|

Updated on: Jul 19, 2026 | 8:32 PM

Share

క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర లిఖించింది. టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లిష్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెన్ డకెట్ వీరోచిత సెంచరీతో పాటు జో రూట్, జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలింగ్ విభాగాన్ని ముక్కలు చేస్తూ లార్డ్స్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు స్కోరును నమోదు చేశారు.

లార్డ్స్ వేదికగా ఆల్‌టైమ్ రికార్డు.. 51 ఏళ్ల చరిత్ర బద్దలు!

సాధారణంగా లార్డ్స్ పిచ్ బ్యాటర్లకు సింహస్వప్నంలా మారుతుంటుంది. ఇక్కడ పరుగులు సాధించడం దిగ్గజ ఆటగాళ్లకు సైతం అంత సులువు కాదు. కానీ, జూలై 19న జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. భారత బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ మైదానంలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

ఇంతకుముందు 1975 జూన్‌లో ఇదే భారత్‌పై ఇంగ్లాండ్ చేసిన 334/4 స్కోరే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. దాదాపు 51 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్లు బద్దలు కొట్టారు.

లార్డ్స్ మైదానంలో అత్యధిక వన్డే స్కోర్లు ఇవే:

ఇంగ్లాండ్ – 387/3 vs భారత్ (2026)

ఇంగ్లాండ్ – 334/4 vs భారత్ (1975)

సౌతాఫ్రికా – 330/8 vs ఇంగ్లాండ్ (2025)

ఇంగ్లాండ్ – 328/6 vs ఐర్లాండ్ (2017)

భారత్ – 326/8 vs ఇంగ్లాండ్ (2002)

టీమిండియా బౌలర్ల దారుణ వైఫల్యం.. గుర్నూర్ బ్రార్‌కు చేదు జ్ఞాపకం..

ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని వికెట్లేమీ తీయలేకపోయాడు. లార్డ్స్ మైదానంలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా బ్రార్ నిలిచాడు. మరో బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం 72 పరుగులు ఇచ్చి వికెట్ సాధించలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ కొంతవరకు రాణించి 6.90 ఎకానమీతో 2 వికెట్లు పడగొట్టినప్పటికీ, ఇంగ్లాండ్ పరుగుల వరదను మాత్రం అడ్డుకోలేకపోయాడు.

వివ్ రిచర్డ్స్ రికార్డును దాటేసిన బెన్ డకెట్..!

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెన్ డకెట్ 141 పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుత ప్రదర్శనతో లార్డ్స్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు సాధించిన బ్యాటర్‌గా వివియన్ రిచ‌ర్డ్స్ (138 పరుగులు, 1979) పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డును డకెట్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, వన్డేల్లో భారత్‌పై ఒక ఇంగ్లాండ్ బ్యాటర్ చేసిన రెండో అత్యధిక స్కోరు ఇదే. 2011లో ఆండ్రూ స్ట్రాస్ చేసిన 158 పరుగుల రికార్డు మాత్రమే దీనికంటే ముందుంది.

రూట్, బట్లర్ ఖాతాలో అరుదైన మైలురాళ్లు..

మరోవైపు, సీనియర్ బ్యాటర్ జో రూట్ వరుసగా ఆరోసారి వన్డేల్లో 50 ప్లస్ స్కోరు సాధించి, ఇంగ్లాండ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌పై రూట్‌కు ఇది 10వ యాభై ప్లస్ స్కోరు కావడం గమనార్హం. జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో తన 350వ సిక్సర్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసింది. లార్డ్స్ మైదానంలో ఒకే ఇన్నింగ్స్‌లో మొదటి రెండు వికెట్లకు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us