AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయుడుపై సానుభూతి అనవసరం!

ముంబై: వరల్డ్‌కప్ 2019 నుంచి టీమిండియా నిష్క్రమించడంతో సెలక్షన్ కమిటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ ముందు నుంచి ఇండియా మిడిల్ ఆర్డర్‌ అంత పటిష్టంగా లేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయి ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారు. అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, మనీష్ పాండే వంటి ఆటగాళ్లను టీమ్ ట్రై చేసినా వారు కూడా ఫెయిల్ అయ్యారు. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్రపంచకప్‌లో రాయుడికి […]

రాయుడుపై సానుభూతి అనవసరం!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 13, 2019 | 7:37 PM

Share

ముంబై: వరల్డ్‌కప్ 2019 నుంచి టీమిండియా నిష్క్రమించడంతో సెలక్షన్ కమిటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ ముందు నుంచి ఇండియా మిడిల్ ఆర్డర్‌ అంత పటిష్టంగా లేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయి ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారు. అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, మనీష్ పాండే వంటి ఆటగాళ్లను టీమ్ ట్రై చేసినా వారు కూడా ఫెయిల్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా టీమిండియా ప్రపంచకప్‌లో రాయుడికి బదులుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను నాలుగవ స్థానంలో ట్రై చేసింది. అయితే అనుకోని విధంగా విజయ్ శంకర్‌కు గాయం కావడం.. ఇక ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. కొంతమంది అయితే బీసీసీఐ వల్లే రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాడని మండిపడ్డారు.

అటు అంబటి రాయుడిని ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని.. ఆ విషయంలో పశ్చాతాపం అవసరం లేదని తాజా ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాల్ పేర్కొన్నారు. 2003లో తాను సెలెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి రాయుడు, కార్తీక్ ఆడుతున్నారన్న ఆయన.. అప్పటి నుంచి వారికి అనేక అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పారు. అయితే తొలి జాబితాలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం కలిగిందన్న ఆయన.. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.