AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో తెలుగబ్బాయ్ అరంగేట్రం పక్కా.. ప్లేయింగ్ 11 నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్..

Nitish Reddy and Harshit Rana Debut: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్‌లో మొదలుకానున్న ఈ టెస్ట్‌లో బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ 11పైనే అందరి ఫోకస్ ఉంది.

IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో తెలుగబ్బాయ్ అరంగేట్రం పక్కా.. ప్లేయింగ్ 11 నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్..
Ind Vs Aus 1st test
Venkata Chari
|

Updated on: Nov 22, 2024 | 6:53 AM

Share

Nitish Reddy and Harshit Rana Debut: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తమ టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తమ ప్రతిభను చాటేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలను బెంచ్‌లో ఉంచుతారు. ఇక్కడ తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించవచ్చు. సుందర్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ అతను అద్భుతాలు చేశాడు. రెండు టెస్టుల్లో మొత్తం 16 వికెట్లు తీసుకున్నాడు. పూణెలో 10 వికెట్లు తీశాడు.

రోహిత్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌..

భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. కేఎల్ రాహుల్ ఇక్కడ యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయవచ్చు. కాగా, రోహిత్ శర్మ స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను చేర్చారు. రోహిత్ శర్మ ఇటీవలే రెండోసారి తండ్రి అయ్యాడు. కాబట్టి అతను మొదటి టెస్ట్‌కు దూరమయ్యాడు. కర్ణాటక బ్యాట్స్‌మెన్ 3వ నంబర్‌లో ఆడగలడు. పడిక్కల్ ఇండియా ఏపై తన అద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో పడిక్కల్ 88 పరుగులు చేశాడు.

జురెల్‌కి కూడా అవకాశం..

భారత్‌లో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో, విరాట్ పాత ఫామ్‌ను చూడాలని జట్టు భావిస్తోంది. పంత్ 5వ స్థానంలో, జురెల్ 6వ స్థానంలో ఆడగలరు. ఆస్ట్రేలియా Aతో జరిగిన మ్యాచ్‌లో జురెల్ అద్భుతమైన ఆటను కనబరిచాడు. ఫలితంగా అతనికి అవకాశం లభించవచ్చు.

బౌలింగ్ యూనిట్ గురించి చెప్పాలంటే, ఇది టీమ్ ఇండియాకు చాలా కష్టం. జట్టు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగవచ్చు. పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. ఆయనతోపాటు మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, నితిష్ రెడ్డి ఉంటారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించాలనుకుంటే, టీమిండియా ఆస్ట్రేలియాను 4-0తో ఓడించాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు..

కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..